Rayapati: టీడీపీ దిక్కుమాలిన పార్టీ.. లోకేష్‌ ఎలా గెలుస్తాడో చూస్తా: రాయపాటి

  • IndiaGlitz, [Sunday,January 14 2024]

టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. పలు జిల్లాలకు చెందిన కీలక నేతలూ ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని, తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లాలోని సీనియర్ నాయకులు రాయపాటి కుటుంబానికి చెందిన రాయపాటి రంగారావు కూడా రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీలో ఇమడలేనని.. తన రాజీనామా లేఖను ఆమోదించాలని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అంతేకాకుండా టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తానంటూ ఛాలెంజ్ కూడా విసిరారు. దీంతో ప్రస్తుతం రంగారావు వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

రూ.150కోట్లు తీసుకున్నారు.

టీడీపీ అసలు రాజకీయ పార్టీయే కాదంటూ ఘాటు విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థ అని ఆరోపించారు తమ కుటుంబాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. గత ఎన్నికల్లో రూ.150 కోట్లు తమ నుంచి తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. లోకేష్, చంద్రబాబు ఎంత తీసుకున్నారో తమ దగ్గర లెక్కలు కూడా ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా మంగళగిరిలో లోకేష్ ఎలా గెలుస్తాడో చూస్తా? అని ఛాలెంజ్ చేశారు. సవాల్ చేసి చెబుతున్నా.. లోకేష్‌ను మంగళగిరిలో ఓడిస్తానని స్పష్టంచేశారు. తండ్రీకొడుకులు ఇద్దరూ దొంగలని విమర్శించారు.

చంద్రబాబు ఫొటోను పగలకొట్టి మరీ..

కియా కంపెనీ తానే తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు.. మరి రాయలసీమలో ఎందుకు ఓడిపోయారని నిలదీశారు. గత ప్రభుత్వంలో ఎస్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను చంద్రబాబు లోకేష్ ఎక్కడ పనిచెయ్యనిచ్చారు?అని ప్రశ్నించార. కన్నా లక్ష్మీనారాయణ ఒక్క కులానికి పని చేస్తారని.. తాము అన్ని కులాలకు పని చేస్తామని రంగారావు వ్యాఖ్యానించారు. అనంతరం తన కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫొటోను ఎత్తి నేలకేసి కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని బీసీలకు కేటాయించాలని టీడీపీ నిర్ణయించడం.. సత్తెనపల్లి సీటును కన్నాకు కేటాయించడంతో ఆయన టీడీపీని వీడినట్లు తెలుస్తోంది.

More News

Hanuman in USA: అమెరికాలో 'గుంటూరుకారం' కుర్చీ మడతపెట్టిన 'హనుమాన్'..

ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది సంక్రాంతికి తెలుగు సినిమా బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఈసారి ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలతో ఓ చిన్న హీరో పోటీ పడటం విశేషం. తొలిరోజు అంటే జనవరి 12న

MP Balasouri: వైసీపీకి మరో బిగ్ షాక్.. పార్టీకి బందర్ ఎంపీ బాలశౌరి రాజీనామా..

ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీకి అసలు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా భావించే నేతలంతా పార్టీకి రాజీనామాలు చేయడం

తెలుగుదేశం పార్టీ నేతలకు షాక్ ఇచ్చిన అంగన్‌వాడీలు

కొద్ది రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం వారి డిమాండ్స్ పట్ల సానుకూలంగా ఉంది.

Chandrababu: సీఐడీ కార్యాలయాలకు వెళ్లిన చంద్రబాబు.. మళ్లీ ఎందుకంటే..?

టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన.. నేరుగా విజయవాడ తులసీనగర్‌లో ఉన్న సీఐడీ కార్యాలయానికి వెళ్లారు.

Pandem Kollu: కాలు దువ్వుతున్న పందెంకోళ్లు.. చేతులు మారనున్న కోట్ల రూపాయలు..

సంక్రాంతి అంటేనే గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు, ముగ్గులు, గొబెమ్మలు. ఇవే కాకుండా ముందుగా వినపడేది కోడిపందాలు.