ఐదుగురు హీరోయిన్లు, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లతో ‘‘రావణాసుర’’ పాలన ప్రారంభం

  • IndiaGlitz, [Tuesday,January 18 2022]

మాస్ మహారాజ్ వరుస సినిమాలతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన చేతిలో నాలుగైదు సినిమాలు వున్నాయి. ఈ క్రమంలో భోగి సందర్భంగా రవితేజ మరో కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ సంస్థలపై రూపొందుతున్న సినిమా 'రావణాసుర' . సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్ నామా నిర్మాత. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయప్రకాష్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.

ఇవాళ్టీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి సినిమాకు సంగీతం అందించనున్నారు. రవితేజ 'బెంగాల్ టైగర్'కు భీమ్స్ సంగీతం అందించారు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న 'డబుల్ ధమాకా'కు కూడా ఆయనే సంగీత దర్శకుడు. అనూ ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా, 'బంగార్రాజు'లో ఓ పాటలో మెరిసిన దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ - మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు.

సినిమా ఓపెనింగ్ రోజునే విడుదల తేదీని కూడా 'రావణాసుర' టీమ్ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. 'రావణాసుర' సినిమాలో రవితేజ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. ఇందులో రాముడిగా కీలక పాత్రలో సుశాంత్ నటించనున్నారు.

More News

కెరీర్ ను మలుపు తిప్పేలా "వర్మ"... వీడు తేడా- హీరో నట్టి క్రాంతి

న‌టుడిగా ర‌జ‌నీకాంత్‌ అంటే ఇష్టం. సినిమారంగంలో గురువులుగా డా. దాస‌రి నారాయ‌ణరావు, డా. డి. రామానాయుడు అయితే న‌ట‌న గురువుగా స‌త్యానంద్ గార‌ని

ఏపీలో నేటి నుంచే అమల్లోకి నైట్ కర్ఫ్యూ.. వారికి మాత్రం మినహాయింపు

కరోనా కేసులు మరోసారి పెరుగుతుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు మరోసారి ఆంక్షలను అమలు చేస్తున్నాయి.

తెలుగువారి ఫేవరేట్ 'చింతామణి' డ్రామాపై ఏపీ సర్కార్ నిషేధం.. ప్రదర్శిస్తే కఠిన చర్యలు

సినిమాలు, సీరియళ్లు రాకముందు తెలుగునాట ప్రజలకు వినోదం అందించింది నాటకాలే. వారాంతాలతో పాటు పండుగల వంటి ప్రత్యేక సందర్భాల్లోనూ నాటకాలు ఊరూవాడా రంజింపజేసేవి.

జీ 5 ఒరిజినల్ సిరీస్ 'లూజర్ 2' ప్రి రిలీజ్ ఈవెంట్... 21న సిరీస్ స్ట్రీమింగ్!

వినోదాత్మక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌లతో అన్ని భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తూ ‘జీ`5 ఓటీటీ’ అంటే ‘వినోదం మాత్రమే కాదు

ప్రేక్ష‌కుల న‌వ్వులే మాకు నిజ‌మైన సంక్రాంతి - హీరో థ్యాంక్స్ మీట్‌లో చిత్ర యూనిట్‌

అశోక్ గ‌ల్లా, నిధి అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన సినిమా `హీరో`. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మాత‌. జ‌గ‌ప‌తిబాబు, న‌రేశ్ ,బ్ర‌హ్మాజీ, మైమ్ గోపీ, రోల్ రిడా త‌దిత‌రులు న‌టించారు.