రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలో రవితేజ ?

  • IndiaGlitz, [Friday,December 08 2017]

వరుస పరాజయాలతో ఉన్న మాస్ మ‌హారాజ్‌ రవితేజ రాజా ది గ్రేట్'తో మళ్ళీ ట్రాక్‌లోకి వ‌చ్చారు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో రవితేజ తన స్పీడ్ పెంచారు. ప్రస్తుతం రవితేజ, విక్రమ్ సిరికొండ రూపొందిస్తున్న టచ్ చేసి చూడు' సినిమా షూటింగులో ఉన్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురానున్నారు.

ఆ సినిమా త‌రువాత‌.. డైరెక్టర్స్ శ్రీను వైట్ల, కళ్యాణ్ కృష్ణలతో రెండు సినిమాలను చేస్తున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. కళ్యాణ్ కృష్ణతో చేస్తున్న సినిమా ఈ నెల నుంచి షూటింగ్ కూడా ప్రారంభించుకోనుంద‌ని తెలిసింది. సోగ్గాడే చిన్ని నాయనా', రారండోయ్ వేడుక చూద్దాం' వంటి కుటుంబ కథా చిత్రాల్ని తీసిన కళ్యాణ్ కృష్ణ.. రవితేజ కోసం రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాను రెడీ చేసార‌ట‌.

ఈ సినిమాని చుట్టాలబ్బాయి' నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

More News

అమరావతిలో 'జై సింహా' పాటల వేడుక ?

నటసింహ నందమూరి బాలకృష్ణ 102వ సినిమా ‘జై సింహా’. ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ రూపొందిస్తున్న ఈ మూవీలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మళ్లీ బ్రేక్ ఇస్తున్న ప్రభాస్ ?

తొలి చిత్రం ఈశ్వర్ నుంచి మిర్చి వరకు.. ప్రతి సంవత్సరం కూడా తన చిత్రాలతో సందడి చేస్తూ వచ్చారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

త్రివిక్రమ్ వారి చేతే చెప్పిస్తున్నాడు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో.. కథానాయికల పాత్రలు కేవలం వినోదం కోసం అన్నట్లుగానే ఉంటుంటాయి. ఒక్క నువ్వే నువ్వేలో మినహాయిస్తే.. ప్రతి సినిమాలోనూ ఇదే శైలి కనిపిస్తుంది. ఆయన రాసే ఆ మాటలతో కథానాయికలకు మంచి పేరే వచ్చింది కూడా.

ప్ర‌వీణ్ స‌త్తారు మ‌ల్టీస్టార‌ర్ మూవీ

'చందమామ కథలు' సినిమాతో నేషనల్ అవార్డును గెలుచుకున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. తాజాగా 'పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ప్రవీణ్. దాదాపు 10 సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న డా.

షూటింగ్ పూర్తి చేసుకున్న'ఏంసీఏ'..డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌

నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నసినిమా 'ఎం.సి.ఎ'. దిల్‌రాజు 'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు భానుమ‌తిగా ప‌రిచ‌య‌మైన సాయిప‌ల్ల‌వి ఎం.సి.ఎలో హీరోయిన్‌గా న‌టించింది.