కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచయం చేస్తున్న ర‌వితేజ‌

  • IndiaGlitz, [Wednesday,December 02 2015]

కెరీర్ తొలినాళ్ళ నుండి కొత్త ద‌ర్శ‌కుల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన ర‌వితేజ త్వ‌ర‌లోనే మ‌రో కొత్త ద‌ర్శ‌కుడిని తెలుగు తెర‌కు ప‌రిచయం చేయ‌నున్నాడు. ప‌వ‌ర్‌, బ‌లుపు వంటి సినిమాల‌కు రచ‌యిత‌గా ప‌నిచేసిన చ‌క్రిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడట‌. చ‌క్రి చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి మాస్ మ‌హారాజా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌.

అయితే ఈ సినిమా నిర్మాత ఎవ‌రో త్వ‌ర‌లోనే తెలిసే అవ‌కాశం ఉంది. గ‌తంలో బోయ‌పాటి, శ్రీనువైట్ల‌, హ‌రీష్ శంక‌ర్‌, బాబీ, గోపిచంద్ మ‌లినేని వంటి ద‌ర్శ‌కుల‌ను ప‌రిచ‌యం చేసిన ర‌వితేజ త్వ‌ర‌లో మ‌రో ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేయ‌నుండ‌టం మంచి ప‌రిణామం.