గోపీతో బోజ్‌పురి నటుడు...

  • IndiaGlitz, [Wednesday,November 22 2017]

గోపీచంద్ క‌థానాయ‌కుడిగా చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న‌ సంగ‌తి తెలిసిందే. కె.కె.రాధామోహ‌న్ ఈ సినిమాను స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌పై నిర్మింబ‌చోతున్నాడు. క‌మ‌ర్షియ‌ల్ వాల్యూస్‌తో పాటు మంచి మెసేజ్ ఉన్న సినిమాగా సినిమా తెర‌కెక్క‌నుంది.

డిసెంబ‌ర్ 16 నుండి సినిమా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో బోజ్‌పురి న‌టుడు ర‌వికిష‌న్ విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడ‌ట‌.

రేసుగుర్రం, కిక్‌2, సుప్రీమ్ వంటి చిత్రాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించిన ర‌వికిష‌న్ ..ఇందులో కూడా స‌రికొత్త విల‌నిజాన్ని చూపించ‌బోతున్నాడ‌ట‌. ఈ చిత్రంలో మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంది.