రవితేజ 'టచ్ చేసి చూడు' షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Friday,December 29 2017]

మాస్ మహారాజా రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' పేరుతో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా చిత్రీకరణ పూర్త‌యింది. .బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ నాయిక‌లు.

నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ "మాకు చిరకాల మిత్రుడైన రవితేజ తో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేశారు. షూటింగ్ పూర్త‌యింది.ప్రస్తుతం రీరికార్డింగ్ జ‌రుగుతోంది'' అని తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం : జామ్ 8, కథ : వక్కంతం వంశీ, స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్, మాటలు : శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి మల్లు,కేశవ్ , ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: రమణ, ఛాయాగ్రహణం : చోటా.కె.నాయుడు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.

More News

మరో ఛాన్స్ కొట్టేసిన సీరత్

రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల బాట పట్టింది 'రన్ రాజా రన్ ' ఫేమ్ సీరత్ కపూర్.

రామ్ చ‌ర‌ణ్ మ‌రోసారి..

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లంతో బిజీగా ఉన్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ  సినిమా త‌రువాత బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నారు చ‌ర‌ణ్‌. జ‌న‌వ‌రి నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది.

నాగ చైతన్య 'ధర్మాభాయ్'?

పెళ్లి తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్పీడ్ పెంచారు అక్కినేని నాగ చైతన్య.

'హలో...' వంటి ఫీల్ గుడ్ మూవీ నా యాభైవ చిత్రం కావడం చాలా హ్యాపీగా వుంది - అనూప్ రూబెన్స్

'జై'చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయి అనతికాలంలోనే 50 చిత్రాలకు మ్యూజిక్ చేసిన అనూప్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ మ్యూజిక్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు

మ‌హేష్ 25 దీపావ‌ళికి రానుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ 24వ చిత్రం 'భరత్ అనే నేను'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో కైరా అద్వాని కథానాయికగా న‌టిస్తోంది.