ఈ నెలలోనే రవితేజ, శ్రీను వైట్ల మూవీ

  • IndiaGlitz, [Friday,February 02 2018]

మాస్ మ‌హారాజా రవితేజ, డెబ్యు డైరెక్టర్ విక్రమ్ సిరికొండ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ టచ్ చేసి చూడు'. శుక్ర‌వారం (ఈరోజు) ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. కాగా, ర‌వితేజ ప్ర‌స్తుతం తన సినిమాల విషయంలో మ‌రింత జోరు పెంచారు. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో చేస్తున్న‌ నేల టికెట్' సినిమా మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకోగా...రెండవ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.

ఇదిలా వుంటే...శ్రీనువైట్లతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రీకరణకి కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మాస్ ఎంటర్‌టైన‌ర్‌ ఈ నెలలోనే చిత్రీకరణ కూడా మొదలుపెట్టుకోనుంద‌ని స్వయంగా రవితేజ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. ఇక రవితేజ మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేయబోతున్న ఈ చిత్రంలో కథానాయికలుగా కాజల్ అగర్వాల్, నివేదా థామస్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తమన్ సంగీత సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.

More News

చరణ్ , బోయపాటి.. ఓ ఐటమ్ సాంగ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

రిలీజ్ కు ముందే ఓ చిన్న చిత్రానికి క్రేజీ ఆఫర్స్!!

ఓ నూతన దర్శకుడు,నూతన నిర్మాణ సంస్థలో రూపొందిన 'ఇంతలో ఎన్నెన్ని వింతలో'

జాతీయ మహిళా సదస్సు 2017...శిల్పారామం...హైదరబాద్

ఫ్రగ్న్యా భారతి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ మహిళా సదస్సు Feb 1 వ తేదీ నుంచి 3వ తేదీ వరకు హైదరబాద్ లోని శిల్ప కలా వేదిక యందు ఘనగా జరుగుతున్నాయి.

ఇందిరా గాంధీ పాత్ర కోసం ఆ ఇద్ద‌రు..

విక్టరీ వెంకటేష్, సెన్సేషనల్ డైరెక్టర్ తేజ కలయికలో 'ఆటా నాదే వేటా నాదే' (ప్ర‌చారంలో ఉన్న పేరు) సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఈ మూవీని 90 నుంచి 120 రోజుల్లో తేజ పూర్తిచేయనున్నారని కథనాలు వచ్చాయి. ఇప్పుడు వాటికి ఊతమిస్తూ.. తేజ ఈ చిత్రాన్ని శరవేగంగా అంటే ఆగష్టు నెలకల్లా పూర్తిచేయడానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింķ

కొత్త ద‌ర్శ‌కుడితో అఖిల్ చిత్రం?

కింగ్ నాగార్జున తన రెండో కుమారుడు అఖిల్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను ప్రముఖ డైరెక్టర్ వి.వి.వినాయక్‌కు అప్పగించారు. నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై.. 'అఖిల్' చిత్రాన్ని వినాయక్ తెరకెక్కించారు. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించక పోవడంతో..రీ-లాంచింగ్ అంటూ అఖిల్ రెండో సినిమాని బ్రిలియంట్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ ĵ