రవితేజ నిర్మాత మళ్ళీ మారాడోచ్...

  • IndiaGlitz, [Thursday,February 11 2016]

ర‌వితేజ ఏ ముహుర్తాన త‌న నెక్ట్స్ మూవీ చెయ్యాల‌నుకుంటున్నాడో కానీ సినిమాకు నిర్మాత‌లు మారుతూనే ఉన్నారు. ర‌వితేజ నిర్మాత‌గా వేణుశ్రీరాం నిర్మాత‌గా సినిమా ఉంటుంద‌ని అనౌన్స్ చేశారు. కానీ రెమ్యున‌రేష‌న్ ప్రాబ్లెం వ‌ల్ల సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ర‌వితేజ, చ‌క్రి కాంబినేష‌న్‌లో దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సినిమా స్టార్ట‌వుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. అయితే ఇప్పుడు రవితేజ రెమ్యున‌రేష‌న్ స‌మ‌స్య‌తో దామోద‌ర్‌ప్ర‌సాద్ కూడా సినిమా చేయ‌లేన‌నేశాడ‌ట‌. దాంతో ర‌వితేజ, దాన‌య్య‌ను క‌లిశాడ‌ట‌. దానయ్య కూడా సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాకు మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందిస్తున్నాడ‌ని స‌మాచారం.