ప్లాప్ దర్శకుడితో...

  • IndiaGlitz, [Thursday,August 20 2015]

కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కొత్త దర్శకుల్లో ఉన్న కసి, ఎనర్జీతో మంచి విజయాలు కూడా సాధించవచ్చునని నమ్మే వ్యక్తి. ప్రస్తుతం సురేందర్ రెడ్డితో కిక్-2'సినిమా చేసిన రవితేజ ఆ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాడు.

ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మాతగా బెంగాల్ టైగర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా పూర్తవుతుంది. అయితే రవితేజ నెక్స్ ట్ మూవీ ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం రవితేజ స్వామిరారా', దోచేయ్' చిత్రాల దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తాడని టాక్.

అయితే రవితేజ లైన్ మాత్రమే విన్నాడని, కథ నచ్చితేనే ఈ సినిమా సెట్స్ లోకి వెళుతుందని కూడా అంటున్నారు. తొలి చిత్రంతో పెద్ద హిట్ కొట్టిన సుధీర్ వర్మ, తన రెండో సినిమాని నాగచైతన్యతో చేసే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ప్లాప్ సినిమాని రూపొందించాడు. మరి రవితేజ కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తాడో మరి...

More News

క్లారిఫై చేసిన నితిన్...

మహానటుడు అక్కినేని మనవడు, కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో

మరోసారి యంగ్ టైగర్ తో...

‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు హరీష్ శంకర్

త్రిష సినిమా స్టార్ట్ అయింది...

చెన్నై బ్యూటీ త్రిష ప్రధానపాత్రలో ‘నాయకి’ చిత్రం గురువారం లాంఛనంగా చెన్నైలో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ‘లవ్ యు బంగారం’ ఫేమ్ గోవి డైరెక్ట్ చేస్తున్నాడు.

మహేష్ కి ఫోన్ చేసిన కేటీఆర్...

‘శ్రీమంతుడు’తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ కి అభిమానుల నుండే కాదు, రాజకీయ నాయకుల నుండి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.

వరల్డ్ రికార్డ్ సాధించిన చంద్రమహేశ్ 'రెడ్ అలర్ట్'

ఏకకాలంలో నాలుగు భాషల్లో సినిమా తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అదో రికార్డ్ లాంటిదే. అందుకే 'రెడ్ అలర్ట్' చిత్రం 'ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించుకుంది.