సుకుమార్, చిరు మధ్యలో రవితేజ?

  • IndiaGlitz, [Saturday,April 14 2018]

‘రంగస్థలం’ వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీ తర్వాత .. తను చేయబోయే ప్రాజెక్టులపై ద‌ర్శ‌కుడు సుకుమార్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తన దగ్గర రెండు, మూడు కథలున్నాయనీ.. ఆ కథల విషయంలో తనకో క్లారిటీ రావాలని ఆయ‌న తెలిపారు. అంతేకాకుండా.. ఆ విషయంలో తనింకా హోమ్‌వర్క్ చేస్తున్నాననీ.. హీరో ఎవరైతే బాగుంటుందో ముందుగా ఆలోచించుకుని చెప్తానని అన్నారు.

అలాగే.. హీరో ఎవరైనా తదుపరి చిత్రం మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనే ఉంటుందని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా సుకుమార్ ఓ కథను మెగాస్టార్ చిరంజీవికి వినిపించారనీ.. ‘రంగస్థలం’లో సుకుమార్ పనితనం చూసి చిరు కూడా ఈ ప్రాజెక్ట్‌కు వెంటనే ఒప్పుకున్నారని సమాచారం. అలాగే.. ఈ కథలో ఓ ముఖ్య పాత్ర కోసం రవితేజ అయితే బాగుందనుకోవడం.. ఆ క్రమంలో రవితేజని కలవడం.. రవితేజ కూడా ఓకే చెప్పడం జరిగిపోయిందని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. ప్రస్తుతం చిరు నటిస్తున్న ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ చిత్ర నిర్మాణం పూర్త‌య్యాకే.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని స‌మాచారం.  ఈ ప్రాజెక్ట్ విష‌యంలో నిజానిజాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

More News

అందుకే తేజ్ టైటిల్ మారుతోందట‌

యువ క‌థానాయ‌కుడు సాయిధరమ్ తేజ్, కేర‌ళ‌కుట్టి అనుపమ పరమేశ్వరన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

చ‌ర‌ణ్ నాకు త‌మ్ముడులాంటోడు!!... 'రంగ‌స్థ‌లం' సినిమాను ఆస్కార్‌కు పంపాలి - ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్‌, సమంత జంటగా నటించిన చిత్రం 'రంగస్థలం'.

మెహ‌రీన్ స్థానంలో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌?

ఐరా క్రియేషన్స్ సంస్థను స్థాపించి.. ఆ సంస్థలో మొద‌టి చిత్రంగా ‘ఛలో’ సినిమాను నిర్మించారు

వ‌రుణ్ చిత్రానికి రెండు వారాల వ‌ర్క్‌షాప్‌

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

అనిల్ చిత్రాన్నే వెంకీ ప‌ట్టాలెక్కించనున్నారా?

విక్టరీ వెంకటేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 'గురు' చిత్రం విడుదలై ఏడాదికి పైనే అవుతోంది.