తమిళ రీమేక్ గురించి క్లారిటీ ఇచ్చిన రవితేజ

  • IndiaGlitz, [Wednesday,May 23 2018]

విజయ్, సమంత జంటగా నటించిన తమిళ చిత్రం 'తెరి'. 2016లో వచ్చిన ఈ చిత్రం తమిళనాట ఘన విజయం సాధించింది. ఈ సినిమాని తెలుగులో కూడా 'పోలీస్‌' పేరుతో అనువదించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని మళ్ళీ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. కీర్తి సురేష్, క్యాథరిన్ కథానాయికలుగా నటించనున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ మీడియా సంస్థ రవితేజను ఇంటర్వ్యూ చేసింది. ఆ సందర్భంలోనే 'తెరి' రీమేక్‌ గురించి ఓ ప్రశ్న వచ్చింది. 'ఈ సినిమా ఆల్రెడీ తెలుగులో డబ్ అయింది కదా? మరి.. మళ్ళీ రీమేక్ చేయడమెందుకు?' అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు.. ఆల్మోస్ట్ 70 శాతం కథ మారింది. చాలా కొత్తగా ఉంటుంది మేము చేసే సినిమా. సినిమా చూస్తే మీకు కూడా ఆ విషయం తెలుస్తుందని బదులిచ్చారు రవితేజ.

ఇదిలా ఉంటే.. ఈ నెల 25న 'నేల టిక్కెట్టు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మాస్ మహారాజా.

More News

'సమ్మోహనం' కోసం 74 ఏళ్ళ వయసులో ఫుల్ రొమాంటిక్ సాంగ్ రాసిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ 

సుధీర్ బాబు, అదితీ రావ్ హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ''సమ్మోహనం'' చిత్రం జూన్ 15న విడుదలకు ముస్తాబవుతోంది.

జూన్ 1న 'వైఫ్ ఆఫ్ రామ్' ట్రైలర్

కెరియ‌ర్ బిగినింగ్ నుండి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ను సంపాదించుకున్న మంచు ల‌క్ష్మి ఈసారి ధీక్ష గా ప్రేక్ష‌కుల‌కు స‌ర్ ప్రైజ్ చేయ‌బోతుంది.

32 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నాగ్‌

క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన కథానాయకుడు అక్కినేని నాగార్జున. 'గీతాంజలి' లాంటి లవ్ స్టోరీస్ గాని.. 'శివ' లాంటి యాక్షన్ మూవీస్ గాని..

నాగార్జున మ‌ల‌యాళ చిత్రం అప్‌డేట్‌

కింగ్ నాగార్జున ఓ మ‌ల‌యాళ చిత్రంలో న‌టిస్తున్నట్లు గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రం

రూమ‌ర్స్‌కు చెక్ పెట్టిన యువ ద‌ర్శ‌కుడు....

తొలి చిత్రం 'భ‌లే మంచి రోజు'తో మంచి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్న యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య‌. త‌ర్వాత సుధీర్ బాబు, నారా రోహిత్‌, సందీప్‌కిష‌న్‌, ఆది సాయికుమార్ హీరోలుగా 'శ‌మంత‌క మ‌ణి'