రెండు నెల‌ల పాటు యు.ఎస్‌లో ర‌వితేజ బిజీ

  • IndiaGlitz, [Tuesday,May 22 2018]

ఏడాదికి కనీసం మూడు సినిమాలైనా విడుదలయ్యేట్టు ప్లాన్ చేసుకుంటున్నారు రవితేజ. ఇప్పటికే ఈ ఏడాదిలో ‘టచ్ చేసి చూడు’తో ప్రేక్షకుల ముందుకు రాగా.. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆయ‌న తాజా చిత్రం ‘నేల టిక్కెట్టు’ ఈ నెల 25న థియేటర్‌లలో సందడి చేయనుంది. అలాగే శ్రీనువైట్ల డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాను కూడా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమాపై పూర్తిగా దృష్టి సారించనున్నారు మాస్ మహారాజా. కథానుసారం యు.ఎస్‌లో చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఇప్పటికే కొంతవరకు షూటింగ్ పార్టును పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రవితేజ కూడా ఫ్రీ అయిపోవడంతో.. రెండు నెలల పాటు యు.ఎస్‌లో జ‌రిగే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌తో బిజీ కానున్నార‌ని సమాచారం. త‌మ‌న్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా, శ్రుతి హాస‌న్ హీరోయిన్లుగా న‌టించే అవ‌కాశ‌ముంది.

More News

దిల్ రాజు, భూమా అఖిలప్రియ చేతుల మీదుగా 'బంగారి బాలరాజు' పాటలు విడుదల

బంగారి బాలరాజు చిత్రం ఆడియోలోని మొదటి మూడు పాటలను నందమూరి కళ్యాణ్ రామ్, నిర్మాతలు అశ్వనీదత్, అనిల్ సుంకర విడుదల చేసిన సంగతి తెలిసిందే.

డ్రైవర్ రాముడు టీజర్ ను విడుదల చేసిన సుధీర్ బాబు

నవ్వుల వీరుడు షకలక శంకర్ హీరో గా  రాజ్ స‌త్య దర్శకత్వంలో

ఒకే నెలలో మూడు సినిమాల‌తో.. 

‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి క్లాస్ చిత్రంతో తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మై.

బాలయ్య కోసం మరోసారి.. పరుచూరి

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

నాగార్జున వెర్స‌స్ స‌మంత‌

అక్కినేని నాగార్జున, చెన్నై బ్యూటీ సమంత కలిసి ఇంత‌కుముందు ‘మనం’, ‘రాజుగారిగది2’ సినిమాల్లో పోటీ ప‌డి మరీ నటించారు.