'డిస్కో రాజా'.. తండ్రీ కొడుకులుగా ర‌వితేజ‌

  • IndiaGlitz, [Wednesday,June 27 2018]

గత ఏడాది ‘రాజా ది గ్రేట్’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు మాస్ మహరాజా రవితేజ. అయితే.. ఆ త‌రువాత వ‌చ్చిన‌ ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్టు’ చిత్రాలు ఆశించిన విజ‌యం సాధించ‌న‌ప్ప‌టికీ.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు రవితేజ. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో నటిస్తున్నారు మాస్ మహరాజా. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ పూర్తైన తర్వాత సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘తెరి’ రీమేక్‌లో రవితేజ నటించనున్నారు.

ఈ రెండు సినిమాలతో పాటు.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాలను రూపొందించిన వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే.. ఇందులో తండ్రీకొడుకులుగా ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నార‌ని.. లుక్ ప‌రంగా కూడా పెద్ద‌గా డిఫ‌రెన్స్ ఉండ‌ద‌ని స‌మాచారం. అలాగే.. ఈ సినిమాకి ‘డిస్కో రాజా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు.. ‘నేల టిక్కెట్టు’ ఫేమ్ మాళ‌వికా శ‌ర్మ ఇందులో క‌థానాయిక‌గా న‌టించ‌నుందని వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

More News

మ‌హేష్ సినిమాలో మ‌రోసారి..

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఉత్త‌రాది భామ‌ పూజా హెగ్డే జంటగా ఓ సినిమా రూపొందుతున్న‌ సంగ‌తి తెలిసిందే.

ఆస్కార్ ఆహ్వానం అందుకున్న భార‌తీయ తార‌లు...

ఆస్కార్ అవార్డుల‌ను ప్ర‌దానం చేసే ద అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్స్ అండ్ సైన్సెస్ సంస్థ కొత్తగా అవార్డులు ప్ర‌దానం చేయ‌డానికి 58 దేశాలు..

డ‌బ్బింగ్ చెప్పుకుంటున్న రాజ్ త‌రుణ్‌

'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21ఎఫ్' లాంటి  రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్‌ల‌తో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్.

'శైలజా రెడ్డి అల్లుడు' ఫ‌స్ట్ లుక్ డిటైల్స్‌

యువ కథానాయకుడు నాగ చైతన్య, కేరళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న సినిమా 'శైలజా రెడ్డి అల్లుడు' (ప్రచారంలో ఉన్న పేరు).

మహేష్ చిత్రంలో 'అల్లరి' నరేష్ పాత్రే పెద్ద ట్విస్ట్‌?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.