అనుతో త‌ప్ప‌కుండా సినిమా చేస్తా - ర‌వితేజ‌

  • IndiaGlitz, [Thursday,May 24 2018]

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో ‘నీకోసం’, ‘వెంకీ’, ‘దుబాయ్‌ శీను’ లాంటి విజయవంతమైన చిత్రాలు రావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రవితేజ సరసన కేర‌ళ‌ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆమె స్థానంలో గోవా బ్యూటీ ఇలియానా వచ్చి చేరింది.

అయితే.. ఈ సినిమా నుంచి అను తప్పుకోవడం గురించి రవితేజ స్పందిస్తూ ఏమన్నారంటే.. “ఆ అమ్మాయి నటిస్తున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’తో మా సినిమా షెడ్యూల్ క్లాష్ అయింది. మా సినిమా అమెరికాలో 50 రోజుల షెడ్యూల్.. అందులోనూ భారీ తారాగణం.. త‌న‌ కోసం షెడ్యూల్‌ను వాయిదా వేసే పరిస్థితి లేదు. అలాగే అను కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది. అందువలనే ఆమె తప్పుకుంద”ని చెప్పుకొచ్చారు రవితేజ. అంతేగాకుండా.. భవిష్యత్తులో అనుతో తప్పకుండా ఓ సినిమా చేస్తానని కూడా పేర్కొన్నారు మాస్ మహారాజా. ఇదిలా ఉంటే.. రవితేజ నటించిన తాజా చిత్రం ‘నేల టిక్కెట్టు’ ఈ నెల 25న విడుదల కానుంది.

More News

మే 26న హీరో సుధీర్‌ బాబు ప్రొడ‌క్ష‌న్స్ లోగో ఆవిష్క‌ర‌ణ‌

ప్రేమ‌ క‌థా చిత్రం , భ‌లే మంచి రోజు, కృష్ణ‌మ్మ‌ క‌లిపింది ఇద్ద‌రిని లాంటి విభిన్న ప్రేమ‌ క‌థా చిత్రాల్లో న‌టించి మెప్పించడమే కాకుండా బాలీవుడ్ లో భాగీ లాంటి భారీ చిత్రంలో న‌టించిన‌ హీరో సుధీర్ బాబు

జూన్‌ 29న సాయిధరమ్‌తేజ్‌-కరుణాకరన్‌ 'తేజ్‌ ఐ లవ్‌ యు'

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వం.

ఏదైనా ఒక‌టి సంక్రాంతికే అంటున్న‌ చరణ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

తమిళ రీమేక్ గురించి క్లారిటీ ఇచ్చిన రవితేజ

విజయ్, సమంత జంటగా నటించిన తమిళ  చిత్రం 'తెరి'. 2016లో వచ్చిన ఈ చిత్రం తమిళనాట ఘన విజయం సాధించింది. ఈ సినిమాని తెలుగులో కూడా 'పోలీస్‌' పేరుతో అనువదించారు.

'సమ్మోహనం' కోసం 74 ఏళ్ళ వయసులో ఫుల్ రొమాంటిక్ సాంగ్ రాసిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ 

సుధీర్ బాబు, అదితీ రావ్ హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ''సమ్మోహనం'' చిత్రం జూన్ 15న విడుదలకు ముస్తాబవుతోంది.