రస్నా బేబి పెళ్లి ఫిక్స్ అయ్యింది!

  • IndiaGlitz, [Friday,November 06 2015]

'ఐ లవ్‌ యూ రస్నా' అంటూ రస్నా బేబీగా అందరికీ తెలిసిన అంకిత లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమై ప్రేమలో పావని కళ్యాణ్‌, ధనలక్ష్మీ ఐ లవ్‌ యూ, సింహాద్రి, విజయేంద్రవర్మ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో తన నటనతో, తన గ్లామర్‌తో హీరోయిన్‌గా తనకంటూ ఓ స్పెషల్‌ ఐడెంటిఫికేషన్‌ తెచ్చుకుంది.

అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చిన అంకిత సడన్‌గా యు.ఎస్‌. షిఫ్ట్‌ అయింది. సినిమా టెక్నాలజీకి సంబంధించిన కోర్స్‌ను యూనివర్సల్‌ స్టూడియోలో చేసింది. కొందరు హాలీవుడ్‌ డైరెక్టర్స్‌ దగ్గర అసిస్టెంట్‌గా కూడా వర్క్‌ చేసింది. సినిమా టెక్నాలజీ నేర్చుకోవాలన్న ఉత్సాహం వెనుక ఫ్యూచర్‌లో డైరెక్టర్‌ అవ్వాలన్న ఉద్దేశం వుందో ఏమో తెలీదుగానీ, ఇప్పుడు మాత్రం పెళ్ళికి రెడీ అయింది. న్యూజెర్సీకి చెందిన ఎన్నారై, జెపి మోర్గాన్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ అయిన విశాల్‌ జగ్తాప్‌ను పెళ్ళాడబోతోంది. ఈరోజు(నవంబర్‌ 6) ఉదయం ముంబైలోని జె.పి. మారియట్‌ హోటల్‌లో పెద్దల సమక్షంలో అంకిత, విశాల్‌ల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

More News

'ఆటాడుకుందాం..రా' ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

కాళిదాసు, కరెంట్‌, అడ్డా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో సుశాంత్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీ జి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో

మహేష్ మాటలతో షాక్ తిన్న వినాయక్..

సూపర్ స్టార్ మహేష్ మాటలతో...సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ షాక్ తిన్నారు. ఈ విషయాన్ని స్వయంగా వినాయకే మీడియాకి తెలియచేసారు. ఇంతకీ విషయం ఏమిటంటే..అఖిల్ ఆడియో వేడుకకు మహేష్ ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే

ఈనెల 9న 'మేము' మ్యూజిక్‌ ఫంక్షన్‌

సూపర్‌స్టార్‌ సూర్య-అమలాపాల్‌-బిందుమాధవి నటిస్తున్న ‘మేము’ చిత్రం ఆడియో ఈనెల (నవంబర్‌) 9 సోమవారం సాయంత్రం విడుదల కానుంది. సూర్య-జ్ఞానవేల్‌రాజా సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సాయిమణికంఠ క్రియేషన్స్‌ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి నిర్మిస్తున్నారు.

'బ్రహ్మోత్సవం' రిలీజ్ డేట్ ఫిక్స్..

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్నతాజా చిత్రం బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు.తెలుగు,తమిళ్ లో పి.వి.పి సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది.

వన్ మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన 'సైజ్ జీరో' ట్రైలర్

సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ నిర్మించిన భారీ చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు.