Rashmika:నాలా ఎంతో మంది భయపడుతున్నారు.. డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన రష్మిక..

  • IndiaGlitz, [Monday,November 06 2023]

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తన మార్ఫింగ్‌ వీడియోపై హీరోయిన్ రష్మిక మందన్నా స్పందించారు. ‘‘ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోన్న నా డీప్‌ఫేక్ గురించి మాట్లాడటానికి ఎంతో బాధపడుతున్నా. టెక్నాలజీ తప్పుగా ఉపయోగించడం వల్ల నాలా ఎంతోమంది భయపడుతున్నారు. ఇదే ఘటన నేను కాలేజీ లేదా స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో జరిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా ఊహించలేనన్నారు. ఒక మహిళగా అందులోనూ నటిగా నన్నెంతగానో సపోర్ట్‌ చేస్తున్న కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. అలాగే మన గుర్తింపునకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలపై కలసికట్టుగా తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది’’ అని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

అసలు ఏం జరిగిందంటే..?

రష్మికకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. డీప్‌ నెక్ బ్లాక్ డ్రెస్‌ వేసుకుని రష్మిక లిఫ్ట్‌లోకి వచ్చినట్లు ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రష్మిక ఏంటి ఇలా ఎక్స్‌పోజింగ్ చేస్తుందంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ కాగా.. ఇది ఫేక్ వీడియో అని తేలింది. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్‌కి సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియోలో జారా ఫేస్ బదులు రష్మిక ఫేస్ పెట్టి మార్ఫింగ్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది. దీనిపై బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ఐటీ శాఖ స్పందన..

రష్మిక మార్ఫింగ్‌ వీడియో వివాదంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జారీ చేసిన ఐటీ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ కొన్ని చట్టపరమైన బాధ్యతలను పాటించాల్సి ఉంటుందన్నారు. తమ మాధ్యమాల్లో ఎవరైనా తప్పుడు పోస్టులు పెడితే వెంటనే గుర్తించి 36 గంటల్లోగా తొలగించాలని తెలిపారు. లేని పక్షంలో ఆ సామాజిక మాధ్యమాలు కోర్టుల్లో లీగల్‌ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మార్ఫింగ్ వీడియోల కట్టడి సోషల్ మీడియా బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

More News

YS Sharmila:సజ్జల రామకృష్ణారెడ్డికి వైఎస్ షర్మిల కౌంటర్.. మీ కథ మీరు చూసుకోండి..

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కౌంటర్ ఇచ్చారు.

శ్రీవారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి

పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. త్రిపుర గవర్నర్ నల్లా ఇంద్రసేనారెడ్డి దర్శించుకున్నారు.

Jagananna Suraksha: అందరికీ రక్షణగా జగనన్న ఆరోగ్య సురక్ష

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి ఓ లెక్క.. అన్నట్లు సీఎం జగన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రజలందరికీ వైద్య సేవలు అందించాలని

ఏపీలో విద్యా సంస్కరణలు భేష్.. నెదర్లాండ్స్ వేదికగా ప్రశంసలు..

ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలపై అంతర్జాతీయ వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Game Changer : రామ్ చరణ్ - శంకర్ ‘‘గేమ ఛేంజర్’’ సినిమా సాంగ్ లీక్ , ఇద్దరిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్

అప్పట్లో పైరసీ భూతం తెలుగు సినిమాను పట్టి పీడంచగా.. ఇప్పుడు లీకులు బెడద వెంటాడుతోంది.