రైతుగా మారిన రష్మిక మందన్న

  • IndiaGlitz, [Thursday,March 18 2021]

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ల‌లో ఒక‌రైన ర‌ష్మిక మంద‌న్న‌.. ఇప్పుడు త‌మిళంతో పాటు బాలీవుడ్‌లోనూ స్పీడు పెంచుతోంది. వరుస సినిమాలు చేస్తూ అందిరి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఇప్పుడు వ‌రుస సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ఈ హ్యుజ్ రిలీజెస్‌లో ర‌ష్మిక‌, కార్తీతో క‌లిసి న‌టించిన సుల్తాన్ సినిమా విడుద‌లవుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఫొటోను ర‌ష్మిక షేర్ చేసింది. ఇంత‌కీ ర‌ష్మిక షేర్ చేసిన ఫొటో ఏంటో తెలుసా?..ర‌ష్మిక రైతుగా మారిన ఫొటోను షేర్ చేసింది. ఈ సినిమాలో ర‌ష్మిక ప‌ల్లెటూరి యువ‌తిగా న‌టించింది. సినిమా షూటింగ్ స‌మ‌యంలో రైతుగా చేసిన ఫొటోను ర‌ష్మిక షేర్ చేసింది. దుక్కిదున్నే యంత్రంతో ర‌ష్మిక రైతుగా మారిన ఫొటో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. సుల్తాన్ సినిమా ఏప్రిల్ 2న విడుద‌ల‌వుతుంది.

అల్లు అర్జున్‌తో సుకుమార్ చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే రీసెంట్‌గా సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో క‌లిసి ‘మిష‌న్ మ‌జ్ను’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ప‌రావాలేదే.. ర‌ష్మిక బాలీవుడ్‌లోనూ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటుందే అని అంద‌రూ అనుకుంటున్న స‌మ‌యంలో మ‌రింత స్పీడు పెంచింది. అలాగే బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో విశాల్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. ఇందులో ర‌ష్మిక అమితాబ్ కుమార్తె పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు.

More News

ప్రముఖ చాక్లెట్‌ సంస్థ క్యాడ్‌బరీ ఇండియాకు సీబీఐ ఊహించని షాక్‌

ప్రముఖ చాక్లెట్‌ సంస్థ క్యాడ్‌బరీ ఇండియాకు సీబీఐ ఊహించని షాక్‌ ఇచ్చింది. తాజాగా క్యాడ్‌బరీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది.

'రంగ్ దే'లో ప్ర‌తి పాటా నాకో ఛాలెంజే: గేయ‌ ర‌చ‌యిత శ్రీ‌మ‌ణి

స్వ‌ల్ప కాలంలోనే తెలుగు చిత్ర‌సీమ‌పై త‌న‌దైన ముద్ర వేసిన గేయ‌ర‌చ‌యిత శ్రీ‌మ‌ణి. ఆయ‌న ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ప‌దేళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భం ఇది.

జొమాటో వివాదం.. ఎంత ఫన్నీగా మారిపోయిందంటే..

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో వివాదం గత కొద్ది రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. జొమాటో బాయ్‌ తనపై దాడి చేశాడంటూ బెంగళూరు యువతి రక్తమోడుతున్న

క్రేజ్‌తో ఫ్యాన్స్ రేట్ ద‌క్కించుకున్న‌ 'రంగ్ దే'

నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మార్చి 26న విడుద‌ల‌వుతుంది. నితిన్‌, కీర్తి జంట‌తో పాటు వెంకీ తెర‌కెక్కించిన

తెలంగాణ బడ్జెట్ కేటాయింపులివే...

2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రవేశ పెడుతున్నారు. బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు