రంగస్థలంకి ఇంటర్వెల్ బాంగ్ హైలైట్ అట‌

  • IndiaGlitz, [Thursday,March 29 2018]

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం 'రంగస్థలం'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని మలిచారు దర్శకుడు. ఆది, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, అనసూయ ప్రధాన పాత్రలు పోషించారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం  బయటకి వచ్చింది. అదేమిటంటే.. ఈ చిత్రం ఇంటర్వెల్ బాంగ్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ.. అక్కడ వచ్చే ట్విస్ట్‌తో చరణ్ నటన ఆకట్టుకునేలా ఉంటుందనీ.. ఈ సన్నివేశం ప్రేక్షకులందరినీ అలరిస్తుందనీ సమాచారం.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో పాటు, దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాట‌లు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేలా చేసాయి. చిరంజీవికి 'ఖైది', 'స్వయంకృషి' ఎలాగో.. చరణ్‌కి ఈ సినిమా అలాగని అందరూ చెప్పడం గమనార్హం. అలాగే.. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాని మరోస్థాయికి తీసుకుని వెళ్తుందని చెప్పడంతో.. అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రేపు (మార్చి 30న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.