'రంగస్థలం' కాంబో రిపీట్ చేస్తుందా?

  • IndiaGlitz, [Thursday,May 10 2018]

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ సినిమాలో ప్రతీ పాత్ర ప్రేక్షకులని ఆకట్టుకుంది. వాటిలో రామలక్ష్మి, కుమార్ బాబు పాత్రలు కూడా కీలకం. రామలక్ష్మిగా సమంత కనిపించగా.. కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి ఒదిగిపోయారు.

ఈ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా 'యు టర్న్'. కన్నడ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత జర్నలిస్ట్ పాత్రలో కనిపించ‌నుండగా.. ఆది పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కన్నడ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ఈ సినిమాని కూడా డైరెక్ట్ చేస్తున్నారు.

కాగా.. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. మ‌రి.. 'రంగస్థలం'లో ఆకట్టుకున్న సామ్, ఆది కాంబినేష‌న్ ఈ సినిమాతో మళ్ళీ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారేమో చూడాలి. తెలుగుతో పాటు త‌మిళంలోనూ విడుద‌ల కానున్న ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టి భూమిక ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది.

More News

చైతు, మారుతి సినిమా స‌గం పూర్త‌య్యింది

యూత్‌ఫుల్ మూవీస్‌తో విజయాలను అందుకున్న దర్శకుడు మారుతి. 'ఈ రోజుల్లో', 'బస్‌స్టాప్', 'ప్రేమకథా చిత్రమ్', 'కొత్తజంట', 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు' లాంటి సినిమాలతో విజయాలను అందుకుని..

లెజెండ్ సినిమా సమర్పణలో విజయ్ ఆంటోనీ 'కాశి' 

సెన్సిబుల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటూ.. నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొన్న విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం 'కాశి'.

నిర్మాణానంతర‌ ప‌నుల్లో 'దేశంలో దొంగ‌లు ప‌డ్డారు'

ఖ‌యూమ్, త‌నిష్క్ రాజ‌న్, షానీ, పృథ్వీ రాజ్, స‌మీర్, లోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సారా క్రియేష‌న్స్  పై  గౌత‌మ్ రాజ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో

పోస్ట్ ప్రొడక్షన్ దశలో సాగరతీరంలో

లాస్య ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకం పై వైజాగ్ సత్యానంద్ మాస్టర్ గారి శిష్యులైన దిశాంత్, ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్ గా సీనియర్ నటులు

రానాతో మాత్ర‌మే వెంట‌వెంట‌నే..

దర్శకుడిగా త‌న‌ తొలి సినిమా అయిన‌ ‘చిత్రం’తోనే ఘ‌న విజ‌యాన్ని అందుకున్నారు తేజ.