‘రంగ్ దే’ షెడ్యూల్ పూర్తి చేసిన నితిన్ అండ్ టీమ్‌

  • IndiaGlitz, [Wednesday,October 07 2020]

నితిన్, కీర్తిసురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రంగ్ దే’. ఈ సినిమా ఫైన‌ల్ ద‌శ షూటింగ్‌కు చేరుకుంది. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో రీస్టార్ట్ చేసిన సినిమా షూటింగ్ నిన్న‌టితో పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని నితిన్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఇక త‌దుప‌రి ఫారిన్ షెడ్యూల్ మాత్ర‌మే మిగిలి ఉంది. మూడు వారాల షూటింగ్‌ను విదేశాల్లో చిత్రీకరించాల్సిన ఉన్న ఈ షెడ్యూల్ కోసం అక్టోబ‌ర్ మూడోవారంలో యూనిట్ అంతా ఇటలీకి వెళ్ల‌నుంది. ఈ షెడ్యూల్‌లో రెండు పాట‌ల‌తో పాటు కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించబోతున్నార‌ట‌. వీసా సంబంధిత ప్రాసెస్ జ‌రుగుతుంద‌ని స‌మాచారం.

అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ‘రంగ్ దే’ను ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయి. మ‌రో వైపు జీ 5 నుండి ఫ్యాన్సీ ఆఫ‌ర్ కూడా ఉండ‌టంతో నిర్మాత‌లు ఏం చేయాలా? అని ఆలోచిస్తున్న‌ట్లు కూడాటాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు న‌వంబ‌ర్‌లో నితిన్ ‘అంధాదున్‌’ రీమేక్‌లో న‌టించ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ రీమేక్‌కు సంబంధించిన లొకేష‌న్ సెర్చ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇది కాకుండా చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ‘చెక్’ సినిమా చిత్రీకరణ కూడా ముగింపు దశకు చేరుకుంది. అన్నీ ప్లానింగ్ ప్ర‌కారం జ‌రిగితే 2021లో నితిన్ మూడు సినిమాల‌తో సంద‌డి చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

More News

అటు సీక్రెట్ టాస్క్.. ఇటు బీబీ గ్రాండ్ హోటల్

నామినేషన్స్ అనంతరం జరిగిన సీన్స్‌తో షో స్టార్ట్ అయింది. ఏడుపులు.. ఓదార్పులు నామినేషన్ తరువాత కూడా కొనసాగాయి.

అదే సీన్ రిపీట్ చేస్తున్న నాగ్‌...!

కింగ్ నాగార్జున‌.. ఒక‌వైపు సినిమాలు, మ‌రో వైపు బిగ్‌బాస్ షోతో బిజీ బిజీగా ఉంటున్నాడు. స్టార్ హీరోస్‌లో ముందుగా షూటింగ్‌ను స్టార్ట్ చేసింది కూడా నాగార్జునే.

‘వకీల్‌సాబ్’ అప్పుడేనా?

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత న‌టిస్తోన్న తొలి చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’.

బాల‌య్య కూడా రెడీ అన్నాడా..?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

జనసేనానిని కలిసిన సుదీప్.. ఆసక్తికర విషయం ఏంటంటే..

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారితో ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు.