'విరాటపర్వం' టీజర్ : గూస్‌బంప్స్ ఖాయం

  • IndiaGlitz, [Thursday,March 18 2021]

వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో నేషనల్ స్టార్ రానా దగ్గుబాటి, సెన్సేషనల్‌ బ్యూటీ సాయిప‌ల్ల‌వి జంట‌గా రూపొందుతోన్న చిత్రం 'విరాట‌ప‌ర్వం'. ‘రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ చిత్ర యూనిట్ వదిలిన అప్‌డేట్స్ అన్నీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ చూస్తుంటే.. గూస్ బంప్స్ రావడం ఖాయం.

మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ట్విటర్ వేదికగా గురువారం విడుదల చేశారు. టీజర్‌ను చూసి చిరు స్టోరీ టెల్లింగ్ అద్భుతంగా ఉందంటూ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఇక టీజర్‌ విషయానికి వస్తే.. ‘ఆధిపత్య జాడలనే చెరిపేయగ ఎన్నినాళ్లు.. తారతమ్య గోడలనే పెకిలించగా ఎన్నినాళ్లు..’ అంటూ రానా గంభీరమైన వాయిస్‌తో చెప్పే అద్భుతమైన విప్లవ కవితతో మొదలవుతుంది. రానా కవిత్వానికి ముగ్దురాలైన సాయిపల్లవి.. శ్రీకృష్ణుడి కోసం కన్నవారిని, కట్టుకున్న వారిని వదలి వెళ్లిన మీరాలా ఆయనను వెదుక్కుంటూ వెళ్లడం.. అక్కడ ఆమె ఎదుర్కొనే పరిస్థితులు వంటి అంశాలతో ఈ టీజర్‌ను కట్ చేశారు.

చాలా కాలం తర్వాత ప్రజా సమస్యలను.. భూస్వామ్య వ్యవస్థను ఎదిరిస్తూ రూపొందిన ఒక సినిమా రాబోతోంది. అయితే ఈ సినిమా ఈ కాలానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా రూపొందించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టీజర్‌లో సాయి పల్లవిని ఒక పోలీస్ సెర్చ్ చేసిన విధానం ఎమోషనల్‌గా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. మొత్తానికి టీజర్‌ను చూస్తుంటే సినిమాపై అంచనాలకు రెక్కలు రావడం ఖాయం అనిపిస్తోంది. బాక్సాఫీస్ షేక్ అవడంలో సందేహం లేదనిపిస్తోంది. రానా ‘అరణ్య’ పేరుతో రాసే కవితలు సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు. మొత్తానికి టీజర్ సినిమా స్థాయిని ఓ లెవల్‌కి తీసుకెళ్లింది. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

రైతుగా మారిన రష్మిక మందన్న

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ల‌లో ఒక‌రైన ర‌ష్మిక మంద‌న్న‌.. ఇప్పుడు త‌మిళంతో పాటు బాలీవుడ్‌లోనూ స్పీడు పెంచుతోంది. వరుస సినిమాలు చేస్తూ అందిరి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

ప్రముఖ చాక్లెట్‌ సంస్థ క్యాడ్‌బరీ ఇండియాకు సీబీఐ ఊహించని షాక్‌

ప్రముఖ చాక్లెట్‌ సంస్థ క్యాడ్‌బరీ ఇండియాకు సీబీఐ ఊహించని షాక్‌ ఇచ్చింది. తాజాగా క్యాడ్‌బరీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది.

'రంగ్ దే'లో ప్ర‌తి పాటా నాకో ఛాలెంజే: గేయ‌ ర‌చ‌యిత శ్రీ‌మ‌ణి

స్వ‌ల్ప కాలంలోనే తెలుగు చిత్ర‌సీమ‌పై త‌న‌దైన ముద్ర వేసిన గేయ‌ర‌చ‌యిత శ్రీ‌మ‌ణి. ఆయ‌న ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ప‌దేళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భం ఇది.

జొమాటో వివాదం.. ఎంత ఫన్నీగా మారిపోయిందంటే..

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో వివాదం గత కొద్ది రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. జొమాటో బాయ్‌ తనపై దాడి చేశాడంటూ బెంగళూరు యువతి రక్తమోడుతున్న

క్రేజ్‌తో ఫ్యాన్స్ రేట్ ద‌క్కించుకున్న‌ 'రంగ్ దే'

నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మార్చి 26న విడుద‌ల‌వుతుంది. నితిన్‌, కీర్తి జంట‌తో పాటు వెంకీ తెర‌కెక్కించిన