Rana:‘రాక్షస రాజా’గా రానా.. ‘నేనే రాజు నేనే మంత్రి’ కాంబో ఈజ్ బ్యాక్..

  • IndiaGlitz, [Thursday,December 14 2023]

హీరో దగ్గుబాటి రానా తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. తనకు బ్లాక్‌బాస్టర్ హిట్ ఇచ్చిన తేజ దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు ‘రాక్షస రాజా’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రానా మాస్ లుక్ ఆకట్టుకుంటుంది. నుదిటికి నామాలు, నోటిలో సిగర్, చేతిలో మెషిన్ గన్ పట్టుకొని డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో మంచి భజ్ ఏర్పడింది. అయితే ఈ చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రానికి సీక్వెల్‌నా..? కాదా..? అనేది తెలియాల్సి ఉంది.

కాగా తేజ దర్శకత్వంలో రానా హీరోగా 2017లో విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’ సూపర్ హిట్ అయింది. కాజల్ అగర్వాల్, కేథ‌రిన్ హీరోయిన్స్‌గా నటించిన ఈ మూవీ రానా కెరీర్‌లోనే బెంచ్ మార్క్ చిత్రంగా నిలిచింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రానా నటన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక వీరిద్దరి కలయికలో మరో సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. రానా, తేజ కూడా తమ కాంబోలో మరో మూవీ ఉంటుందని చెబుతూ వచ్చారు. మొత్తానికి ఈరోజు అధికారికంగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే బాబాయ్ వెంకటేశ్‌తో కలిసి రానా నటించిన ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌. ఇందులో ఇద్దరు తండ్రీ కొడుకులుగా కనిపించిన ఈ సిరీస్‌ పలు వివాదాల్లో నిలిచింది. ఇందులో మోతాదుకు మించి వల్గర్ కంటెంట్ ఉందని.. వెంకటేశ్ లాంటి సీనియర్ హీరో బూతులు మాట్లాడం ఏంటని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా కానీ ఈ సిరీస్ మాత్రం బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ మరో అరుదైన ఘనతను సాధించింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో 2023 జనవరి నుంచి జూన్‌ వరకు ఎక్కువ వ్యూస్‌ వచ్చిన జాబితాలో 'రానా నాయుడు’ చోటు దక్కించుకుంది. భారత్‌ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న సిరీస్ కూడా ఇదే కావడం విశేషం.

More News

Gaddam Prasad:తెలంగాణ శాసనసభాపతిగా బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్

తెలంగాణ అసెంబ్లీ మూడో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు  ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.

Bigg Boss Telugu 7 : బిగ్‌బాస్ నాకు రెండో తల్లి అన్న యావర్ .. రైతు గర్వపడేలా చేస్తానన్న ప్రశాంత్ , ఇద్దరూ ఏడిపించేశారుగా

బిగ్‌బాస్ 7 తెలుగు ఈ వారంతో ముగియనున్న సంగతి తెలిసిందే. గత వారం శోభాశెట్టి ఎలిమినేట్ కాగా..

Guntur Karaam:'గుంటూరు కారం' నుంచి క్లాస్ సాంగ్ వచ్చేసిందోచ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు మరో శుభవార్త వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో

Uddanam: ఉద్దానం ప్రజలకు అండగా సీఎం జగన్.. దశాబ్దాల కల సాకారం..

శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంను దశాబ్దాలుగా కిడ్నీల సమస్య వేధిస్తోంది. తరతరాలుగా కిడ్నీలు పాడై ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా

Gaddam Prasad:తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ(బుధవారం) సాయంత్రంతో స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది.