'యాత్ర' లో విజ‌య‌మ్మ‌గా ర‌మ్య‌కృష్ణ‌?

  • IndiaGlitz, [Friday,April 20 2018]

సమైక్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత డా.రాజశేఖర్ రెడ్డి జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహి వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఎం.ఎం.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. మండువేస‌విలో దాదాపు 1475 కి.మి.పాదయాత్ర చేసి.. ఆ యాత్ర ప్రభావంతో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతను చేప‌ట్టారు వై.ఎస్.ఆర్. అందుకే ఈ సినిమాకి ‘యాత్ర’ అనే పేరే తగినదని భావించి.. ఆ పేరునే ఖరారు చేశారు.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. వై.ఎస్.ఆర్.పాత్రలో మల‌యాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కాగా.. వై.ఎస్.ఆర్. సతీమణి విజయమ్మగా నయనతారను ఎంపిక చేసినట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా రమ్యకృష్ణ పేరు వినిపిస్తోంది. రమ్య అయితే ఆ పాత్రకు న్యాయం చేస్తుందని భావించి.. ఆమెను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే.. వై.ఎస్.జగన్‌గా తమిళ నటుడు సూర్య నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

More News

నిర్మాతగా మారబోతున్న సదా

‘జయం’ చిత్రంతో ఆకట్టుకున్న ఉత్తరాది భామ సదా నిర్మాతగా మారనున్నారా?

ప‌ల్లెటూరి అమ్మాయిగా...

శ‌ర్వానంద్‌, సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

ప్రభాస్ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ‘సాహో’ సుజీత్ దర్శకత్వంలో

పొలిటికల్‌ టచ్‌తో సాగే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ 'భరత్‌ అనే నేను'- కొరటాల శివ

'శ్రీమంతుడు' వంటి ఇండ్రస్టీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందించిన సూపర్‌స్టార్‌ మహేశ్‌ సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన రెండో చిత్రం 'భరత్‌ అనే నేను'.

పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే కు అరుదైన గౌరవం

పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే కు అరుదైన గౌరవం