Ramcharan:మిస్టర్ కూల్ ధోనీని కలిసిన రామ్‌చరణ్.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్..

  • IndiaGlitz, [Wednesday,October 04 2023]

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ యాడ్ షూటింగ్ కోసం ముంబైలో వీరిద్దరు కలిశారు. ఓ ప్రైవేట్ కంపెనీ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. అయితే అది ఏ కంపెనీకి చెందిన యాడ్ అనేది మాత్రం తెలియరాలేదు. గతంలో అంటే సుమారు 13 సంవత్సరాల క్రితం ధోనీ, చెర్రీ ప్రముఖ కూల్ డ్రింక్స్ కంపెనీ పెప్సీ షూటింగ్‌లో కలిశారు. మళ్లీ ఇప్పుడు కలిసి యాడ్ చేశారు. ఈ ఫొటోలో యంఎస్‌డీ, చరణ్ చాలా స్టైలిష్‌గా ఉండడంతో ఇద్దరు కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయొచ్చు కదా అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రతి సంవత్సరం అయ్యప్పస్వామి దీక్షలో చరణ్..

అయ్యప్పస్వామికి చెర్రీ పెద్ద భక్తుడు. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను వేసుకుని దీక్షలో ఉంటారు. ఈసారి కూడా అయ్యప్ప మాల దీక్షలో ఉన్న చరణ్.. ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో దీక్ష విరమించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. దివంగత అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన ఏఎన్నార్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన చెర్రీ అయ్యప్ప మాలలో ఉన్నారని అందరికీ తెలిసింది. ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన చెర్రీ చెప్పులు లేకుండా ఉండటంతో బాలీవుడ్ మీడియా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. అలాగే భక్తులు కూడా రామ్ చరణ్ సింప్లిసిటీని చూసి ముక్కున వేలు వేసుకున్నారు.

త్వరలోనే 'గేమ్ ఛేంజర్' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల..

ప్రస్తుతం చెర్రీ.. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంతో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, సునీల్, SJ సూర్య, నవీన్ చంద్ర, సముద్రఖని, అనన్య సహా పలువురు నటిస్తున్నారు. ఇక చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి లీక్ అయిన ఓ పాట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ మూవీ నుంచి అధికారికంగా ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. వచ్చే ఏడాది వేసవి కాలంలో మూవీ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు బుచ్చిబాబు సాన దర్శకత్వంతోనూ ఓ చిత్రానికి చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

More News

Bandi Sanjay:ప్రధాని మోదీ వ్యాఖ్యలతో కేసీఆర్ కుటుంబంలో చీలిక వచ్చింది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నిజామాబాద్‌లో ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.

Vande Bharat :వందేభారత్ స్లీపర్ కోచ్‌ల డిజైన్లు విడుదల.. 2024 మొదట్లో అందుబాటులోకి..

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వందే భారత్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందే భారత్ రైళ్లు పట్టాలపై తిరుగుతున్నాయి.

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు .. స్పందించని జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. పెడనలో జరగనున్న తన వారాహి యాత్రలో దాడులు చేస్తారని..

Asian Games:ఆసియా క్రీడల్లో భారత పతకాల వేట.. ఆర్చరీలో బంగారు పతకం

ఆసియా క్రీడల్లో భారత్ ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. పతకాల వేటలో దూసుకుపోతున్నారు. తాజాగా ఆర్చరీ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో

Ramcharan:ముంబై సిద్ధి వినాయకుని ఆలయంలో రాంచరణ్.. అయ్యప్పస్వామి మాల దీక్ష విరమణ

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని గ్లోబల్ స్టార్‌గా నిలిచారు.