సినీ ఇండ‌స్ట్రీ గురించి రామ్ ట్వీట్‌

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న ప‌లు రంగాల్లో సినీ పరిశ్ర‌మ ముందు వ‌రుస‌లో ఉంది. థియేట‌ర్స్ మూత‌ప‌డ‌టం, షూటింగ్స్ లేక‌పోవ‌డం వంటి కార‌ణాలతో సినీ ప‌రిశ్ర‌మ స్తంభించింది. దీంతో విడుద‌ల‌కు సిద్ధ‌మైన ప‌లు సినిమాల విడుద‌ల‌లు ఆగిపోయాయి. దీంతో ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌లు త‌మ ఫ్లాట్‌ఫామ్స్ పరిధిని పెంచుకోవ‌డానికి విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ప్రారంభించారు. ఓ మోస్త‌రు బ‌డ్జెట్‌లో రూపొందిన ప‌లు సినిమాలను ఓటీటీలోనే రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు ఓకే అనుకుని ముందుకు వ‌చ్చారు.

ఈ క్ర‌మంలో ఓటీటీ బిజినెస్‌పై హీరో రామ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. ‘‘సినీ ఇండస్ట్రీలో ఓ విష‌యం ఉంది. సినిమా కొంద‌రికీ ప్యాష‌న్‌. చాలా మందికి అదే సినిమా వ్యాపారం. మిగిలిన వారంద‌రికీ అదొక ఆట‌. ఎవ‌రి దృష్టితో వారు దాన్ని చూస్తుంటారు’’ అన్నారు రామ్‌. ఈయ‌న హీరోగా న‌టించిన రెడ్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తే క‌రోనా ప్ర‌భావంతో సినిమా విడుద‌ల ఆగింది. ఈ త‌రుణంలో సినిమా ఓటీటీలో విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే రామ్ ఈ వార్త‌ల‌ను ఖండించారు. త‌న రెడ్ సినిమా థియేట‌ర్స్‌లోనే విడుద‌ల‌వుతుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

More News

టాలీవుడ్‌కు మళ్లీ షాకిచ్చిన కేసీఆర్.. ఆశలు ఆవిరి!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తున్న కష్టకాలంలో యావత్ భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న విషయం విదితమే. ఇప్పటికే మూడు లాక్ డౌన్‌లు పూర్తవ్వగా.. 4.0 మే-18 నుంచి మే-31వరకు ఉండనుంది.

వైఎస్ జగన్‌.. నేను కలిసే ఉన్నాం.. మాకేం వివాదాల్లేవ్ : కేసీఆర్

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పోతిరెడ్డిపాడు వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ వ్యవహారంపై పరోక్షంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిని కాస్త హెచ్చరిస్తూనే కేసీఆర్ మాట్లాడారు.

కేంద్రం ప్యాకేజీ దరిద్రం.. ఆ ముష్టి మాకొద్దు : కేసీఆర్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కష్ట కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం విదితమే. దీనిపై ఐదు దఫాలుగా పూర్తి వివరాలను

తెలంగాణ రికార్డ్స్ బద్ధలు కొడుతోంది : కేసీఆర్

తెలంగాణ చాలా అద్భతమైన వ్యవసాయ రాష్ట్రం.. ఇక్కడ అద్భుతమైన నేలలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇవాళ సుధీర్ఘ కేబినెట్ భేటీ అనంతరం ప్రగతి భవన్‌లో

తెలంగాణలో వీటికి మాత్రమే కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలోనూ 4.0 లాక్ డౌన్‌ కొనసాగిస్తామని రాష్ట్రముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏమేం నడుస్తాయ్..?