మాస్ డైరెక్ట‌ర్‌తో ఉస్తాద్‌..?

  • IndiaGlitz, [Saturday,March 20 2021]

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ త‌న త‌దుప‌రి సినిమాకు లైన్ క్లియ‌ర్ చేసుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి రెడ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఉస్తాద్ రామ్‌.. నెక్ట్స్ మూవీని ఎవ‌రితో చేస్తాడ‌నే దానిపై చాలా ర‌కాలైన వార్త‌లు వినిపించాయి. అయితే లింగుస్వామి దర్శకత్వంలో సినిమా ఖరారైంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌క ముందే రామ్ మ‌రో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టాడ‌ని టాక్ వినిపిస్తోంది.

సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు రామ్ త‌దుప‌రి సినిమాను మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. లింగుస్వామి పూర్తి చేసిన త‌ర్వాత రామ్ కాస్త రెస్ట్ తీసుకుంటాడు. ఆ గ్యాప్‌లో బోయ‌పాటి శ్రీను.. బాల‌కృష్ణ‌తో సినిమాను పూర్తి చేసి రామ్ సినిమా క‌థ‌పై కూర్చుంటాడు. స్క్రిప్ట్ ఓకే అయిన త‌ర్వాత సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుంద‌ని స‌మాచారం. అంతా ఓకే అయితే, క్లాస్‌గా క‌నిపిస్తూ వ‌చ్చిన రామ్‌ను పూరీ జ‌గ‌న్నాథ్ మాస్ హీరోగా చూపించాడు. మ‌రోసారి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రామ్... మాస్ పాత్ర‌లో ప్రేక్ష‌కాభిమానుల‌ను అల‌రిస్తాడ‌నడంలో సందేహం లేదు.

More News

సాయితేజ్15.. జోడీ ఖ‌రారైంది..!

మెగా క్యాంప్ హీరో, సాయితేజ్ హీరోగా కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తోన్న

హైదరాబాద్ ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం

నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించారు.

అడివి శేష్‌ హీరోగా 'హిట్‌ 2'.. లాంఛనంగా ప్రారంభం

కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయడానికి, కొత్త కాన్సెప్ట్‌ సినిమాలను తెరకెక్కించడానికి నిర్మాణంలో భాగమైన హీరో నాని వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై

'పీన‌ట్ డైమండ్' టీజర్ విడుదల చేసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు ..!!

అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌  ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త?

తెలంగాణలో కాక రేపుతున్న వేతన సవరణ అంశానికి మరో రెండు రోజుల్లో తెరపడనుంది.