రామ్-త్రినాథ‌రావు-దిల్ రాజు కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం

  • IndiaGlitz, [Wednesday,November 29 2017]

ఈ ఏడాది ఇప్ప‌టికే ఐదు సినిమాల స‌క్సెస్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద నిర్మాత‌గా ..త‌న సెల‌క్ష‌న్ ఆఫ్ మూవీస్ గురించి చెప్ప‌క‌నే చెప్పిన దిల్‌రాజు..ఇదే ఏడాది విడుద‌ల కానున్న 'ఎం.సి.ఎ' చిత్రంతో డ‌బుల్ హ్యాట్రిక్‌ను సాధించ‌నున్నారు. ఇదే ఊపులో వ‌చ్చే ఏడాది ఎన‌ర్టిటిక్ హీరో రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో ఓ సినిమా రూపొందిస్తున్నారు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ 2017 ప్రారంభంలో విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించిన 'నేను లోక‌ల్‌' సినిమా ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నారు. రామ్ ఎన‌ర్జీకి, త్రినాథ‌రావు న‌క్కిన టేకింగ్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మేకింగ్ వాల్యూస్ తోడు కావ‌డం సినిమాకు పెద్ద ప్ల‌స్ అవుతుందన‌డంలో సందేహం లేదు.

ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో షూటింగ్ ప్రారంభం కానుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రం లో చాలా కీలకమైన పాత్ర ఒకటి పోషిస్తున్నారు. ఒక ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రం లో నటిస్తారు. ఈ చిత్రానికి కధ ప్రసన్న కుమార్ బెజవాడ అందిస్తున్నారు. సాయి కృష్ణ రచనా సహకారం అందిస్తారు. ఒక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి పని చేయనున్నారు. ఇతర టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని నిర్మాణ సంస్థ తెలియ‌జేసింది.

More News

మ‌హేష్ సినిమా అప్‌డేట్స్‌...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'భ‌ర‌త్ అను నేను'(రిజిష్ట‌ర్డ్ టైటిల్‌). డివివి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుద‌ల చేస్తున్నారు.

వివ‌ర‌ణ ఇచ్చుకున్న త్రిష‌...

చేతినిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న త్రిష‌..విక్ర‌మ్‌, హ‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న 'సామి స్క్వేర్' లో నుండి త‌ప్ప‌కుంది.  అస‌లు త్రిష ఎందుకు త‌ప్పుకుంద‌నే దానిపై త్రిష త‌న పాత్ర‌కు త‌గ్గ ప్రాధాన్యత సీక్వెల్‌లో లేద‌ని తెలియ‌డంతో త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం.

టెలివిజ‌న్ సిరీస్ స్ఫూర్తితో వెంకీ, తేజ చిత్రం?

నేనే రాజు నేనే మంత్రితో ప‌దిహేనేళ్ల త‌రువాత విజ‌యాన్ని అందుకున్నారు ద‌ర్శ‌కుడు తేజ‌. ప్ర‌స్తుతం ఆయ‌న రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉన్నారు.

మూడు రోజుల పండ‌గ

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ క్రిస్మ‌స్ ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే.. పండ‌గ సంద‌ర్భంలో వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఆస‌క్తిక‌ర‌మైన సినిమాలు విడుద‌ల కానుండ‌డ‌మే అందుకు కార‌ణంగా చెప్పొచ్చు.

6 కోట్లకు అల్లు శిరీష్ ఒక్క క్షణం ఆంధ్రా హక్కులు

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ డైరెక్షన్ లో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్