రామ్ స్టోరీ లైన్ ఎంటంటే...

  • IndiaGlitz, [Tuesday,December 26 2017]

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ఇప్పుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా మామ‌, అల్లుడు మ‌ధ్య జ‌రిగే ఆస‌క్తిక‌ర‌మైన పోరు ..ఎందుకు? చివ‌ర‌కి గెలిచిందెవ‌రు? అనే పాయింట్స్‌తో తెర‌కెక్క‌నుంది.

అల్లుడు పాత్ర‌లో హీరో రామ్ న‌టిస్తే..మామ పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నాడ‌ట‌. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ త్వ‌ర‌లోనే పూర్త‌వుతుంద‌ని, హీరోయిన్ ఎవ‌ర‌నేది అప్పుడే ఖ‌రార‌వుతుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ ఏడాది నేను లోక‌ల్ అనే సినిమాతో స‌క్సెస్ కొట్టిన త్రినాథ‌రావు న‌క్కిన ఎలాగైనా ఈ సినిమాతో మ‌రో స‌క్సెస్ అందుకోవాల‌ని అతృత‌గా ఎదురుచూస్తున్నారు.

More News

రియల్ పాత్రలో...

చెలియా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన హైదరాబాదీ అదితిరావ్ హైదరీ..

వెంకీ,రానా వెబ్ సిరీస్‌...

బాబాయ్ విక్ట‌రీ వెంక‌టేష్‌, ద‌గ్గుబాటి రానా క‌ల‌యిక‌లో ఓ వెబ్ సిరీస్ మొద‌లు కానుంది. మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హ‌త్య ప్ర‌ధానంగా సాగే క‌థ‌నంతో ఈ సిరీస్ కొన‌సాగుతుంద‌ట‌.

చిరంజీవి రైట్ హ్యాండ్ ఎవ‌రో తెలుసా...

త‌మిళంలో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ విజ‌యాల‌ను అందుకుంటున్న హీరో విజ‌య్ సేతుప‌తి. ఈ యువ క‌థానాయ‌కుడు తొలిసారి 'సైరా న‌ర‌సింహారెడ్డి' ద్వారా స్ట్ర‌యిట్ తెలుగు సినిమాలో న‌టిస్తున్నాడు.

'బటర్ ప్లయిస్' ఫస్ట్ లుక్ లాంఛ్

నిర్మాతగా వంద చిత్రాలకు చెరువవుతున్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. తన భీమవరం టాకీస్ పై 92 చిత్రంగా 'బటర్ ప్లెయిస్ ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు‌ . కె.ఫణిరాజ్ దర్శకత్వం వహిస్తొన్న ఈ సినిమాలొ అందరు ఆడవాళ్లె నటిస్తుండటం విశేషం.

మనందరి బాగు కోసం మనం సైతం...

కష్టాల వలయంలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆపన్నులను ఆదుకుంటూ అతి పెద్ద ఛారిటీ సంస్థగా ఎదుగుతోంది మనం సైతం. ఈ సంస్థ తాజాగా మరో పది మంది నిస్సహాయులకు ఆర్థిక సహాయం అందజేసింది.