నితిన్ బాటలోనే రామ్

  • IndiaGlitz, [Thursday,March 15 2018]

ఎవ‌రైనా స‌క్సెస్ ఇచ్చిన కాంబినేష‌న్‌తోనే వ‌రుస‌గా రెండో సినిమా కూడా చేస్తారు. అయితే ప్ర‌స్తుతం ఇద్ద‌రు యువ క‌థానాయ‌కులు అందుకు భిన్నంగా వెళుతున్నారు. ఆ యువ క‌థానాయ‌కులు మ‌రెవ‌రో కాదు.. నితిన్‌, రామ్‌. గ‌తేడాది 'లై' చిత్రంలో త‌న‌కు జోడీగా న‌టించిన మేఘా ఆకాష్‌తో 'ఛ‌ల్ మోహ‌న్ రంగ' అంటూ వెను వెంట‌నే మ‌రో సినిమా చేస్తున్నాడు నితిన్. 'లై' చిత్రం ఫ్లాప్ అయినా.. ఆమెకు నితిన్ మ‌రో అవ‌కాశం ఇవ్వ‌డం వార్త‌ల్లో నిలిచింది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు నితిన్ బాట‌లోనే మ‌రో హీరో రామ్ కూడా వెళుతున్నారు. గ‌తేడాది 'ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ'లో త‌న‌కు జోడీగా న‌టించిన కేర‌ళ‌కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో త‌న త‌దుప‌రి చిత్రం 'హ‌లో గురు ప్రేమ కోస‌మే' చేస్తున్నాడు రామ్‌. 'ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ' ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా.. అనుప‌మ‌తో రామ్ వెనువెంట‌నే మ‌రో సినిమా చేయ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. తొలిసారి క‌లిసి న‌టించిన‌ప్పుడు క‌లిసిరాని క‌థానాయిక‌ల‌తో.. వ‌రుస‌గా రెండో సారి సినిమాలు చేస్తున్న ఈ యువ క‌థానాయ‌కుల‌కు రెండో సారైనా విజ‌యం ల‌భిస్తుందేమో చూడాలి.

More News

ఆ రీమేక్ కు ముహుర్తం కుదిరిందా?

అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో అర్జున్ కపూర్,అలియా భట్ జంటగా నటించిన హిందీ చిత్రం '2స్టేట్స్'.

భ‌ర‌త్ అనే నేను.. ఆ రెండూ కీల‌క‌మే

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌మైక్యాంధ్ర ముఖ్య‌మంత్రిగా న‌టిస్తున్న చిత్రం 'భ‌ర‌త్ అనే నేను'. 'శ్రీ‌మంతుడు' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌రువాత మ‌హేష్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

20వ కళాసుధ అవార్డుల ప్రధానం

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్న ఈ సంస్థ ఈ ఉగాది సందర్భంగా కళా సుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 20వ ఉగాది పురస్కారాలను అందించనుంది.

న‌య‌న‌తార‌ 'క‌ర్త‌వ్యం'.. ఉగాది సంద‌ర్బంగా మార్చి 16న విడుద‌ల

ద‌క్షిణాది అన్ని భాష‌ల్లో న‌టించి స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌ ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వం లో శివ లింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్ మరియు క్రేజి ప్రాజెక్ట్ ల‌తో విజ‌యాల్ని సాధిస్తున్న‌ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తం గా  ట్ĸ

'వైశాఖం' చిత్రానికి ఎక్కువ అప్రిషియేషన్‌ తో పాటు అవార్డులు రావడం చాలా హ్యాపీగా ఉంది - జయ బి

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ, వి టీమ్‌, జె వరల్డ్‌ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు.