అదే తేడా అంటున్న వర్మ

  • IndiaGlitz, [Friday,December 09 2016]

ఎప్పుడూ ఎవ‌రినో ఒక‌రిని ఏదైనా అంటూనో లేక త‌న సినిమాల్లో ఏదో ఒక సెన్సేష‌న్‌తో వార్త‌ల్లో నిలిచిన సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ ఇప్పుడు విజ‌య‌వాడ రౌడీ యిజం నేప‌థ్యంలో వంగ‌వీటి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈ సినిమా కోసం డిసెంబ‌ర్ 20న హైద‌రాబాద్‌లో ఈవెంట్‌ను నిర్వ‌హిస్తున్నారు.

ఈ వేడుక‌కు అమితాబ్‌, నాగార్జున ముఖ్యఅతిథులుగా వ‌స్తుండ‌టం విశేషం. ఈ సంద‌ర్భంగా రాంగోపాల్ వ‌ర్మ ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించాడు. సిద్ధార్థ్ ఇంజ‌నీరింగ్ కాలేజ్‌లో చ‌దివేట‌ప్పుడు అమితాబ్ న‌టించిన 'అఖ‌రి రాస్తా' సినిమా పైర‌సీ సీడీల‌ను అమ్మాను. ఇప్పుడు అదే అమితాబ్‌తో స‌ర్కార్ 3 చేస్తున్నాన‌ని పెర్కొన్నాడు. ఈ మెసేజ్‌తో అప్పుడు, ఇప్పుడు ఉన్న తేడాను వ‌ర్మ త‌న యాంగిల్‌లో తెలియ‌జేయ‌డం విశేషం.