రామ్‌, దిల్‌రాజు 'హ‌లో గురు ప్రేమ కోస‌మే'  ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

  • IndiaGlitz, [Monday,May 14 2018]

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నిర్మాణంలో త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'హ‌లో గురు ప్రేమ కోస‌మే'. మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.  విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను నేడు విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్బంగా... శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత దిల్‌రాజు మాట్లాడుతూ ఎన‌ర్జిటిక్ రామ్‌ని స‌రికొత్త కోణంలో చూపే చిత్రం 'హ‌లో గురు ప్రేమ కోస‌మే'. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. జూన్ ఫ‌స్ట్ వీక్‌లో కాకినాడ‌, ప‌రిస‌ర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జ‌రుపుకోనుంది. దీని తర్వాత హైద‌రాబాద్‌లో కొంత పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేస్తాం. దీంతో చిత్రీక‌ర‌ణంతా పూర్త‌వుతుంది.

ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల అయ్యేట్టు గా ప్లాన్ చేస్తున్నాం. 'సినిమా చూపిస్త మావ‌', 'నేను లోక‌ల్' వంటి వ‌రుస విజ‌యాలు త‌ర్వాత త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. అవుట్‌పుట్ చాలా బాగా వ‌స్తోంది. త‌ప్ప‌కుండా మా బ్యాన‌ర్‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేలా ఈ చిత్రం ఉంటుందన‌డంలో సందేహం లేదు అన్నారు. 

ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: విజ‌య్ కె.చ‌క్ర‌

More News

నేడే కాశి ప్రీ రిలీజ్ ఈవెంట్

ఆల్ రౌండర్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎక్జాంపుల్ విజయ్ ఆంథోని. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకొంటూ.. నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొన్న విజయ్ ఆంటోనీ

'స‌వ్య‌సాచి' యు.ఎస్‌. షెడ్యూల్ పూర్తి

నాగ చైతన్య, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'సవ్యసాచి'. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

నాలుగోసారి అదే హీరోయిన్‌తో బాల‌య్య‌...

నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు త‌న తండ్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ య‌న్‌.టి.ఆర్ విష‌యంలో కాస్త స‌మ‌యం తీసుకుంటున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

రికార్డ్ ధ‌ర‌కు 'మ‌హాన‌టి' శాటిలైట్ హ‌క్కులు

కీర్తి సురేశ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'మ‌హాన‌టి'.  మే 9న విడుద‌లైన ఈ చిత్రం తిరుగులేని విజ‌యాన్ని ద‌క్కించుకుంది. తెలుగు, త‌మిళంలో స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో రికార్డ్ క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తుంది.

ఎన్టీఆర్‌తో మ‌రో సినిమా ప్లాన్ చేస్తున్న ద‌త్‌

ఒక‌ప్పుడు సీనియ‌ర్ ఎన్టీఆర్‌, చిరంజీవి వంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన నిర్మాత సి.అశ్వ‌నీద‌త్‌. ఇప్పుడు ద‌త్ కుమార్తెలు ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్న ద‌త్‌లు నిర్మాత‌లుగా మారారు.