చ‌రణ్‌తో బాలీవుడ్ న‌టుడు...

  • IndiaGlitz, [Monday,December 18 2017]

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా జ‌న‌వ‌రి నుండి బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

సాధార‌ణంగా బోయపాటి శ్రీను సినిమాల్లో విల‌న్ పాత్ర‌ల‌కు చాలా ప్రాముఖ్య‌త ఉంటుంది. అలాగే బోయ‌పాటి కొత్త విల‌న్స్‌ను తెరకు ప‌రిచ‌యం చేస్తుంటాడు. జ‌గ‌ప‌తిబాబు, ఆది పినిశెట్టి వంటి హీరోలు కూడా బోయపాటి సినిమాలో విల‌న్స్‌గా న‌టించిన‌వారే.

ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ సినిమాలో విల‌న్‌గా బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్ న‌టించ‌బోతున్నాడ‌ట‌. ర‌క్త‌చ‌రిత్ర సినిమాతో తెలుగులో న‌టించిన వివేక్ ఒబెరాయ్‌, రీసెంట్ వివేకం సినిమాలో కూడా విల‌న్‌గా న‌టించాడు. ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ సినిమాలో విల‌న్‌గా బోయ‌పాటి ఎలా ప్రెజెంట్ చేస్తాడో మ‌రి.

More News

గుండు హ‌నుమంతురావు, పొట్టి వీర‌య్య‌ల‌కు చిరంజీవి 4ల‌క్ష‌లు ఆర్ధిక‌ స‌హాయం

క‌మెడియ‌న్ గుండు హ‌నుమంతురావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధప‌డుతోన్న నేప‌థ్యంలో టెలివిజ‌న్ లో ప్ర‌సార‌మ‌య్యే 'అలీతో జాలీ'గా షో ద్వారా గుండు ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి 2ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్ ను  'మా' మూవీ ఆర్టిస్ట్  అసోసియేష‌న్ అధ్య‌క్షుడు శివాజీ రాజా ద్వారా అంద‌జేశారు.

జో పాత్ర మెప్పిస్తుందంటున్న సురభి

ఉషాకిరణ్ మూవీస్ వారి బీరువా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ సుందరి సురభి.

సాయిధరమ్ కి ఈ సారైనా కలిసొస్తుందా?

సుప్రీమ్ తరువాత సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్.

అజ్ఞాత‌వాసికి స్ఫూర్తి ఆ పుస్త‌క‌మేనా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న 25వ చిత్రం అజ్ఞాత‌వాసి. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

ఈ వారంలోనే జై సింహా టీజ‌ర్‌

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం జై సింహా. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార, హ‌రి ప్రియ‌, న‌టాషా దోషి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.