తొలిసారి చార్మినార్ ను సందర్శించిన స్టార్ హీరో..!

  • IndiaGlitz, [Thursday,August 04 2016]

తొలిసారి చార్మినార్ ను సంద‌ర్శించిన స్టార్ హీరో ఎవ‌రో కాదు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. అవును... రామ్ చ‌ర‌ణ్ తొలిసారిగా ఈరోజు చార్మినార్ ను సంద‌ర్శించారు. ఈ విష‌యాన్ని రామ్ చ‌ర‌ణ్ స్వ‌యంగా ఫేస్ బుక్ ద్వారా తెలియ‌చేసారు. చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ధృవ‌. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు.
గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం హైద‌రాబాద్ లోని ఓల్డ్ సిటీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ షూటింగ్ గ్యాప్ లో చ‌ర‌ణ్ చార్మినార్ పైకి ఎక్కి వీక్షించారు. ఈ విష‌యాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలియ‌చేస్తూ...ఫ‌స్ట్ టైమ్ చార్మినార్ పైకి ఎక్కాను. అక్క‌డ నుంచి చూస్తే అద్భుతంగా ఉంది అంటూ త‌న సంతోషాన్ని పంచుకున్నారు. అంతే కాదండోయ్ చార్మినార్ పై చ‌ర‌ణ్ ఉన్న‌ స్టిల్ ను కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు.

More News

ఈనెల‌ 12 న ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోన్న భారీ చిత్రం జనతా గ్యారేజ్ . ఎన్టీఆర్ సరసన స‌మంత‌, నిత్యా మీనన్ లు కథానాయికలు గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్రఖ్యాత మల‌యాళ నటుడు మోహన్ లాల్  ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.

నిఖిల్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందట...!

ఇంతకీ పెళ్లి చేసుకోబోతున్న నిఖిల్ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..?కలర్స్ స్వాతి.

చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే ఆడియో విడుదల

పవన్,సోనియా దీప్తి హీరో,హీరోయిన్లుగా పి.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్ పై సంతోష్ నెలంటి దర్శకత్వంలో సోని పవన్,రజిని గట్టు నిర్మించిన చిత్రం చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే.

కళాకారుడు బీకేఎస్ వర్మకు దర్శకేంద్రుడు చేతుల మీదుగా స్వర్ణకంకణాన్ని బహూకరించిన బ్రహ్మానందం

ఆయన పేరున్న నటుడు.తెలుగు చలనచిత్ర సీమలో హాస్యమనే సామ్రాజ్యాన్ని ఏలుతున్న మకుటంలేని మహాచక్రవర్తి.ఆయన వృత్తి నటన.

నా సినిమాని గొప్ప సినిమాతో పొల్చ‌డం అంటే అంత‌కంటే ఏం కావాలి - డైరెక్ట‌ర్ ప‌రుశురామ్

యువ‌త‌, ఆంజ‌నేయులు, సోలో, సారొచ్చారు...ఇలా వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను అందించిన డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ తాజా చిత్రం శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు.