రామ్‌చ‌ర‌ణ్ విల‌న్ ద‌ర్శ‌కుడు కాబోతున్నాడు

  • IndiaGlitz, [Monday,December 18 2017]

అర‌వింద్ స్వామి.. పేరుకి త‌మిళ చిత్రాల క‌థానాయ‌కుడు అయినా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా ఆయ‌న సుప‌రిచితుడే. రోజా, బొంబాయి త‌దిత‌ర అనువాద చిత్రాల‌తో తెలుగు వారికి ద‌గ్గ‌రైన అర‌వింద్‌.. మౌనం అనే స్ట్ర‌యిట్ తెలుగు సినిమా కూడా చేశారు. కొంత కాలం పాటు సినిమాల‌కు దూరంగా ఉన్న అర‌వింద్‌.. క‌డ‌లి సినిమాతో తిరిగి తెర‌పైకి వ‌చ్చారు. త‌మిళ చిత్రం త‌ని ఒరువ‌న్‌తో ప్ర‌తినాయ‌కుడిగా మారిన ఈ అందాల న‌టుడు.. తెలుగులో ఆ సినిమా రీమేక్ వెర్ష‌న్ అయిన ధృవలోనూ విల‌న్‌గా అల‌రించారు.

ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్‌, అర‌వింద్ స్వామి మ‌ధ్య సాగే స‌న్నివేశాలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం త‌మిళంలో క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ బిజీగా ఉన్న అర‌వింద్ స్వామి.. వ‌చ్చే ఏడాది ద‌ర్శకుడిగా కొత్త అవ‌తారం ఎత్త‌నున్నారు. ఈ సినిమా గురించి అర‌వింద్ స్వామి ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని తెలియ‌జేశారు.

అదేమిటంటే.. ఎవ‌రూ ఊహించ‌ని విభిన్న‌మైన క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని.. ఇది అర‌వింద్ స్వామినే డైరెక్ట్ చేశాడా అని అనిపించేలా ఆ సినిమా ఉంటుంద‌ని సెల‌విచ్చారు. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఉంటుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.