చ‌ర‌ణ్‌.. ఇద్ద‌రు అన్నయ్య‌లు

  • IndiaGlitz, [Monday,January 22 2018]

ఈ ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రెండు సినిమాలు విడుదల కానున్నాయి. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'రంగస్థలం' మార్చి 30న విడుదల కానుండగా....ఇక ఇటీవల చిత్రీకరణ ప్రారంభించుకున్న‌ బోయపాటి శ్రీను సినిమాని కూడా ఈ ఏడాదిలోనే విజయదశమి సంద‌ర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయమొకటి.. టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. ఇంత‌కీ అదేమిటంటే....ఈ రెండు చిత్రాల్లో చెర్రీకి అన్నపాత్రలు ఉండడం.. అవి కీలక పాత్రలు కావడం. అలాగే ఈ పాత్రలు కూడా కథానాయకులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిన నటులు చేయడం. 2006లో 'ఒక V చిత్రం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత 'సరైనోడు' మూవీతో విలన్ గా, 'నిన్ను కోరి' చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనని తాను నిరూపించుకున్న ఆది పినిశెట్టి ..'రంగస్థలం' సినిమాలో రామ్ చరణ్‌కి అన్నయ్యగా కనిపించనున్నారని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

అలాగే బోయపాటి మూవీలో చెర్రీకి అన్న పాత్రలో తమిళ నటుడు ప్రశాంత్ నటించనున్నారు. 1992లో 'లాఠీ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రశాంత్.. 'తొలిముద్దు', 'దొంగ దొంగ', 'చామంతి', 'జీన్స్', 'జోడి' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే.

ఇక ఈ రెండు పాత్రలు కూడా ఆయా సినిమాలకు కీలకపాత్రలు కావడం విశేషం.మ‌రి.. ఒకే ఏడాదిలో బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో రెండు సినిమాల‌తో వ‌స్తున్న చెర్రీకి ఎలాంటి ఫ‌లితాలు ద‌క్కుతాయో చూడాలి.

More News

ఫిలిం నగర్ దైవ సన్నిదానం చైర్మన్ గా డా.మోహన్ బాబు

ఫిలిం నగర్ దైవ సన్నిదానం చైర్మన్ పదవికి  డా. మోహన్ బాబు గారు నేడు ప్రమాణ స్వీకారం చేసారు.

మళ్ళీ నటిస్తానంటున్న బాపు బొమ్మ

దివ్యవాణి....తాను బాపుగారి బొమ్మ.... తెలుగు ప్రేక్షకులలో తనదైన ముద్రవేసుకుందీ ముద్దుగుమ్మ...

ఎన్టీఆర్ పాత్రలో నాని...

వరుస విజయాలను సాధిస్తున్న నేచరల్ స్టార్ నాని ప్రస్తుతం 'కృష్ణార్జున యుద్దం'సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' ఆడియో ఆవిష్కరణ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై నిర్మితమవుతున్న చిత్రం 'తొలిప్రేమ'.

'దివ్య మణి' ఆడియో లాంఛ్

మోహ్ మాయా ఎంటర్ టైన్మెంట్స్,రెడ్ నొడ్ మీడియా పతాకంపై గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలొ నిర్మిస్తొన్న చిత్రం'దివ్య మణి'.