రాజ‌మౌళితో మొద‌లుపెడుతున్న రామ్ చ‌ర‌ణ్‌

  • IndiaGlitz, [Thursday,March 01 2018]

క‌థానాయ‌కుడిగా రామ్ చ‌ర‌ణ్ కెరీర్ మొద‌లై ప‌దేళ్ళు దాటింది. ఈ ప‌దేళ్ళ కాలంలో హీరోగా ప‌ది సినిమాలతో సంద‌డి చేశాడు చ‌ర‌ణ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 11 వ చిత్రం రంగ‌స్థ‌లం.. మార్చి 30న విడుద‌ల కానుంది. ఇక 12వ చిత్రంగా బోయ‌పాటి శ్రీ‌నుతో చేస్తున్న మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ ద‌స‌రాకి విడుద‌ల కానుంది.

ఈ చిత్రం త‌రువాత రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో సినిమా చేయ‌నున్నాడు చ‌ర‌ణ్‌. మ‌ల్టీస్టార‌ర్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌తో పాటు ఎన్టీఆర్ కూడా క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రాజ‌మౌళితో చేస్తున్న సినిమా రామ్ చ‌ర‌ణ్‌కు ప్ర‌త్యేకం అనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్ప‌టివ‌ర‌కు త‌ను హీరోగా న‌టించిన చిత్రాల‌లో ఏ ద‌ర్శ‌కుడితోనూ రెండోసారి సినిమాలు చేసిన వైనం లేదు.

రాజ‌మౌళి కాంబినేష‌న్‌తోనే ఇలా రెండో సారి సినిమా చేయ‌డం అనే అంశానికి శ్రీ‌కారం చుడుతున్నాడు చ‌ర‌ణ్‌. ఆ త‌రువాత సురేంద‌ర్ రెడ్డి, పూరీ జగ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా చేసే అవ‌కాశ‌ముంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. నాయ‌క్ త‌రువాత వి.వి.వినాయ‌క్ డైరెక్ష‌న్‌లో ఖైదీ నెం.150 చేసినా.. అది ఓ పాట‌లో త‌ళుక్కున మెరిసే అతిథి పాత్ర కావ‌డం గ‌మ‌నార్హం.

More News

మహేష్ అన్న తనయుడు సినిమాల్లోకి...

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ సినిమాల్లో టాప్ స్టార్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే.

విలన్ పాత్రలో తమిళ హీరో

కన్నడం,తెలుగులో విడుదలవుతున్న చిత్రం 'రాజారథం'.

కాలాకి తెలుగులో ఆదరణ కరువైందా?

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

'సాక్ష్యం' కు క్రేజీ ఆఫర్

‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్.

అల్లు అర్జున్ ట్రెండింగ్...

అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళం,మలయాళ రాష్ట్రాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.