చ‌ర‌ణ్ మూడోసారీ హిట్ కొడ‌తాడా?

  • IndiaGlitz, [Saturday,April 28 2018]

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఇప్ప‌టివ‌ర‌కు సంక్రాంతి సీజ‌న్ బాగానే క‌లిసొచ్చింద‌నే చెప్పాలి.  ఇప్ప‌టికే ఈ పండ‌గ సంద‌ర్భంలో వ‌చ్చిన‌ రెండు సినిమాల‌తోనూ విజ‌యం సాధించారు ఈ యంగ్ హీరో.  చరణ్ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం 'నాయక్'.. 2013 సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విడుద‌లై మంచి విజ‌యం సాధించింది.

అలాగే.. అల్లు అర్జున్‌తో క‌లిసి చరణ్ చేసిన మల్టీస్టారర్ మూవీ 'ఎవడు' కూడా 2014 సంక్రాంతికి విడుదలై చరణ్‌కు రెండో సంక్రాంతి విజయాన్ని అందించింది. ఇప్పుడు ఇదే సంక్రాంతికి మూడో సారి సంద‌డి చేసేందుకు చ‌ర‌ణ్ సిద్ధ‌మవుతున్నారు.

ప్ర‌స్తుతం రామ్‌ చరణ్ హీరోగా, బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంద‌ని స‌మాచారం. మరి ఇప్పటి వరకు రెండు సంక్రాంతి విజయాలను సొంతం చేసుకున్న చరణ్.. వచ్చే సంక్రాంతితో హ్యాట్రిక్ విజయం అందుకుంటారేమో చూడాలి. 

More News

నివేదా హీరోయిన్ కాద‌ట‌

'జెంటిల్‌మన్', 'నిన్నుకోరి', 'జై లవకుశ' చిత్రాల‌తో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది కేర‌ళ‌ కుట్టి నివేదా థామస్.

మ‌హేష్‌ను వెంటాడుతున్న సెంటిమెంట్‌

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'భరత్ అనే నేను'  బాక్సాఫీస్ వ‌ద్ద‌ విజయం వైపు పరుగులు తీస్తోంది.

గ్రామీణ నేపథ్యంలో ఎన్టీఆర్ మూవీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న‌ విషయం తెలిసిందే.

తొలిసారి సంక్రాంతి బరిలో బోయపాటి ఫిల్మ్

తెలుగులో యాక్షన్ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన‌ దర్శకుల‌లో బోయపాటి శ్రీను ఒక‌రు. ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై

య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్ కొత్త డైరెక్ట‌ర్ ఎవ‌రంటే..

మ‌హాన‌టుడు, దివంగ‌త నేత నంద‌మూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా య‌న్‌.టి.ఆర్ పేరుతో ఓ బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.