రామ్ చ‌ర‌ణ్ మ‌రోసారి అలాగే..

  • IndiaGlitz, [Saturday,March 31 2018]

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌ను మ‌లుపు తిప్పిన చిత్రాల‌లో మ‌గ‌ధీరది ప్ర‌త్యేక స్థానం. ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ ద‌శ‌, దిశ మారింద‌నే చెప్పాలి. ఆ సినిమా త‌రువాత చ‌ర‌ణ్ కెరీర్‌లో చెప్పుకోద‌గ్గ విజ‌యాలున్నా.. మ‌ళ్ళీ న‌టుడిగా గుర్తింపును తీసుకువ‌చ్చింది మాత్రం తాజాగా విడుద‌లైన రంగ‌స్థ‌లం చిత్రం. ఇందులో చెవుడు ఉన్న చిట్టిబాబు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ బాగా ఒదిగిపోయార‌నే చెప్పాలి.

ఇదిలా ఉంటే.. ఈ రెండు సినిమాల‌కు సంబంధించి ఓ కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఉంది. అదేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా ఆయా  చిత్రాల ద‌ర్శ‌కుల‌కి 7వ చిత్రాలు కావ‌డం. మ‌గ‌ధీర చిత్రం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి ఏడో చిత్ర‌మైతే.. రంగ‌స్థ‌లం చిత్రం బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్‌కు ఏడ‌వ సినిమా కావ‌డం విశేషం.

మొత్త‌మ్మీద ఏడో చిత్రాలు చేసిన ద‌ర్శ‌కుల‌కు రామ్ చ‌ర‌ణ్ క‌లిసిరావడ‌మే కాకుండా.. త‌న‌కి కూడా ఆయా సినిమాలు పేరు తీసుకు రావ‌డం గ‌మనార్హం. మ‌రి.. మున్ముందు కూడా ఈ విష‌యంలో మ‌రెవ‌రైనా డైరెక్ట‌ర్ కూడా చేరుతారేమో చూడాలి.

More News

సెక్యూరిటీ ఆఫీస‌ర్‌ పాత్ర‌లో సునీల్‌?

కెరీర్ ప్రారంభంలో క‌మెడీయ‌న్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్‌..

శృతి హాస‌న్ కొత్త చిత్రానికి ఓకే చెప్పిందా?

రెండేళ్ళ క్రితం వరకు స్టార్ హీరోయిన్ హోదాలో ఓ వెలుగు వెలిగిన క‌థానాయిక శృతి హాసన్.

విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రానికి త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు

‘పెళ్లిచూపులు’, అర్జున్ రెడ్డి’ చిత్రాల విజ‌యాల‌తో యూత్ స్టార్ విజయ్ దేవరకొండ

'2 స్టేట్స్‌' లో మిస్ విజ‌య‌వాడ‌

ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం '2 స్టేట్స్‌'.

మ‌ల్టీస్టార‌ర్ కోసం మూడు నిర్మాణ సంస్థ‌లు...

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ సంస్కృతి ఎక్కువ అవుతుంది. అందులో భాగంగా విక్ట‌రీ వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీస్టార‌ర్ రూపొంద‌నుంది.