అభిమానుల సాక్షిగా సర్‌ప్రైజ్‌ను రివీల్ చేసిన రామ్ చరణ్

  • IndiaGlitz, [Friday,March 26 2021]

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు రేపు(శనివారం). ఈ సందర్భంగా ఆయన ఒక పెద్ద సర్‌ప్రైజ్‌ను ముందే రివీల్ చేసేశాడు. రేపు పుట్టినరోజు కావడంతో ఈ రోజు ఆయనను కలిసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. దీంతో చెర్రీ బయటకు వచ్చి అభిమానులతో కాసేపు ముచ్చటించాడు. అభిమానులను చూసిన సంతోషం చెర్రీ కళ్లలో స్పష్టంగా కనిపించింది. ఆ ఆనందంలో చెర్రీ రేపటి సర్‌ప్రైజ్‌ను ముందే రివీల్ చేసి అభిమానులను ఫుల్ ఖుషీ చేసేశాడు.

రేపు తన పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ పోస్టర్ కూడా రాబోతోందని ఇదొక సర్‌ప్రైజ్ అని చెర్రీ వెల్లడించారు. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ కూడా ఆయన పుట్టినరోజుకు సర్‌ప్రైజ్‌ను సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. బర్త్ డేకు ఒకరోజు ముందుగానే 'ఆర్ఆర్ఆర్' టీం అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయబోతోంది. ఈ సినిమాలో చెర్రీ పాత్ర ఏ రేంజ్‌లో ఉండబోతోందో తెలిపేందుకు గాను.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రామ్ చరణ్ రౌద్ర రూపాన్ని పరిచయం చేసేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నారు.

More News

అసెంబ్లీ వేదికగా లాక్‌డౌన్‌పై కేసీఆర్ క్లారిటీ..

తెలంగాణలో లాక్‌డౌన్‌పై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు.

కేసీఆర్ సర్కారుపై కన్నెర్రజేసిన కాగ్...

2019 సంవత్సరానికి గానూ ప్రభుత్వరంగ సంస్థలపై కాగ్ తన నివేదికను విడుదల చేసింది. కేసీఆర్ సర్కారుపై కన్నెర్రజేసిన కాగ్..

రూ.20 లక్షలను కాల్చేసిన తహసీల్దార్..

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా  20 లక్షల రూపాయలను భార్య సాయంతో కాల్చిపడేశాడో తహసీల్దార్.

‘ఉప్పెన’ దర్శకుడికి భారీ గిఫ్ట్ అందజేసిన నిర్మాతలు

లేటుగా వచ్చినా.. లేటెస్ట్‌గా వచ్చి ప్రేక్షకుల హృదయాలను దోచుకుని.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ‘ఉప్పెన'.

సీబీఐ ఎఫ్‌ఆర్‌ఐపై స్పందించిన రఘురామ

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సీబీఐ ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా రఘురామ కృష్ణరాజు వివరణ ఇచ్చారు.