జనవరిలో రానున్న 'రంగస్థలం' ఫస్ట్ లుక్

  • IndiaGlitz, [Wednesday,November 29 2017]

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా రంగస్థలం 1985'. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా న‌టిస్తోంది. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూరుస్తున్నారు.

గోదావరి తీరంలో.. గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. మరో నాలుగు రోజుల్లో రంగ‌స్థ‌లం టాకీ పార్ట్ పూర్తవుతుందని తెలిసింది. మిగిలి ఉన్న‌ నాలుగు పాటలను డిసెంబర్ లో చిత్రీకరించనున్నారు.

మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారని తెలిసింది.

పూజా హెగ్డే ఓ ప్ర‌త్యేక గీతంలో మెర‌వ‌నున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వేస‌వి కానుక‌గా మార్చి 29న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

More News

నాగ శౌర్య కథానాయకునిగా మన్యం ప్రొడక్షన్స్ నూతన చిత్రం ప్రారంభం

యువ కథానాయకుడు నాగ శౌర్య నూతన చిత్రం నేడు (29-11-17) ఉదయం 10 గంటల 34 నిమిషాలకు సంస్థ కార్యాలయం లో ప్రారంభ మయింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ క్లాప్ నిచ్చారు.

రామ్-త్రినాథ‌రావు-దిల్ రాజు కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం

ఈ ఏడాది ఇప్ప‌టికే ఐదు సినిమాల స‌క్సెస్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద నిర్మాత‌గా ..త‌న సెల‌క్ష‌న్ ఆఫ్ మూవీస్ గురించి చెప్ప‌క‌నే చెప్పిన దిల్‌రాజు..ఇదే ఏడాది విడుద‌ల కానున్న 'ఎం.సి.ఎ' చిత్రంతో డ‌బుల్ హ్యాట్రిక్‌ను సాధించ‌నున్నారు.

మ‌హేష్ సినిమా అప్‌డేట్స్‌...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'భ‌ర‌త్ అను నేను'(రిజిష్ట‌ర్డ్ టైటిల్‌). డివివి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుద‌ల చేస్తున్నారు.

వివ‌ర‌ణ ఇచ్చుకున్న త్రిష‌...

చేతినిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న త్రిష‌..విక్ర‌మ్‌, హ‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న 'సామి స్క్వేర్' లో నుండి త‌ప్ప‌కుంది.  అస‌లు త్రిష ఎందుకు త‌ప్పుకుంద‌నే దానిపై త్రిష త‌న పాత్ర‌కు త‌గ్గ ప్రాధాన్యత సీక్వెల్‌లో లేద‌ని తెలియ‌డంతో త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం.

టెలివిజ‌న్ సిరీస్ స్ఫూర్తితో వెంకీ, తేజ చిత్రం?

నేనే రాజు నేనే మంత్రితో ప‌దిహేనేళ్ల త‌రువాత విజ‌యాన్ని అందుకున్నారు ద‌ర్శ‌కుడు తేజ‌. ప్ర‌స్తుతం ఆయ‌న రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉన్నారు.