చరణ్ మూవీకి సంబంధించి ఆసక్తికరమైన ఫోటో...

  • IndiaGlitz, [Monday,September 04 2017]

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'రంగ‌స్థ‌లం 1985'. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌ఫై రూపొందుతోన్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాలో న‌టి అన‌సూయ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది.

ఈరోజు అన‌సూయ ట్విట్ట‌ర్‌లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో మెట్టెలు వేసుకున్న ఓ స్త్రీ కాలు క‌న‌ప‌డుతుంది. ప‌క్క‌నే ఓ మ‌ట్టి కుండ ఉంది. ఈ ఫోటోతో పాటు 'నింద నిజ‌మైతే త‌ప్పు దిద్దుకో..అబ‌ద్ధ‌మైతే న‌వ్వేసి ఊరుకో' అనే క్యాప్ష‌న్ పెట్టారు. మ‌రి ఈ క్యాప్ష‌న్ రంగ‌స్థ‌లంలో అన‌సూయ పాత్ర‌కు సంబంధించిందా లేదా, వ్య‌క్తిగ‌త అభిప్రాయామా అని తెలియాలంటే కొంత‌కాలం వేచి చూడాల్సిందే. ఈ సినిమాను 1985 కాల‌మానాలు ప్ర‌కారం ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కించాడు.

More News

హిందీలో 'అర్జున్ రెడ్డి'...

టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు ఇండియా వైడ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

రెండు వారాలు..ఎనిమిది సినిమాలు..

దసరాకి రెండు పెద్ద సినిమాలు పోటాపోటీగా విడుదలవుతుండడంతో..

'యుద్ధం శరణం' సెన్సార్ పూర్తి..సెప్టెంబర్ 8న గ్రాండ్ రిలీజ్

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్పై

'స్పైడర్ ' రెండో పాట 'హాలీ హాలీ' విడుదల

మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో ఠాగూర్ మధు సమర్పణలో

టీఎస్ఎఫ్ డీసీ తొలి ఛైర్మన్ గా రామ్మోహనరావు ప్రమాణ స్వీకారం!

తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్ డీసీ)తొలి ఛైర్మన్గా పూస్కూర్ రామ్మోహన్రావు సోమవారం హైదరాబాద్లోని