రామ్ చరణ్ హీరోయిన్ మారనుందా...?

  • IndiaGlitz, [Tuesday,January 24 2017]

మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ ఒక ప‌క్క ధృవ‌తో హీరోగా, ఖైదీ నంబ‌ర్ 150 చిత్రంతో నిర్మాత‌గా స‌క్సెస్‌ల‌ను సాధించాడు. ఇప్పుడు రాంచ‌ర‌ణ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ జ‌న‌వ‌రి 30న సినిమా లాంచ‌నంగా ప్రారంభం కానుంది. ఈ సినిమాలో రాంచ‌ర‌ణ్ స‌ర‌స‌న మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమాలో రాంచ‌ర‌ణ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించ‌లేద‌ని తెలుస్తుంది. సుకుమార్ అండ్ టీం రాంచ‌ర‌ణ్ స‌ర‌స‌న మ‌రో హీరోయిన్‌ను అన్వేషిస్తున్నార‌ట‌. మ‌రి రాంచ‌ర‌ణ్ ప‌క్క‌న ఏ హీరోయిన్ న‌టిస్తుందో చూడాలి...