రేపే చరణ్ మూవీ ప్రారంభం..

  • IndiaGlitz, [Tuesday,February 09 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బ్రూస్ లీ ఫ్లాప్ త‌ర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. త‌మిళ మూవీ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో చ‌ర‌ణ్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని రేపే ప్రారంభించ‌నున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. త‌మిళ్ లో ఘ‌న విజయం సాధించిన త‌ని ఓరువ‌న్ క‌థ‌లో తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు కొన్ని మార్పులు చేసార‌ని స‌మాచారం. త‌ని ఓరువ‌న్ లో విల‌న్ పాత్ర పోషించిన అర‌వింద్ స్వామి తెలుగులో కూడా విల‌న్ పాత్ర పోషిస్తున్నారు. బ్రూస్ లీ తో స‌క్సెస్ సాధించ‌లేక‌పోయిన చ‌ర‌ణ్ ఈసారి ఎలాగైనా స‌రే స‌క్సెస్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ చిత్రాన్ని ఆగ‌ష్టులో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

More News

రవితేజతో మళ్ళీ...

బెంగాల్ టైగర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ వెంటనే సినిమా చేయలేదు.

కొత్త టైటిల్ రిజిష్టర్ చేసిన నాగ్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సంక్రాంతికి రిలీజైన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం నాగ్ కెరీర్ లోనే నెం 1 చిత్రంగా నిలిచింది.

చైతు కూడా లాగించేశాడు...

నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం మజ్ను. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణను జరుపుకుంటుంది.

పెదనాన్నకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్...

రెబల్ స్టార్ కృష్ణంరాజు...తన దర్శకత్వంలో ప్రభాస్ తో సినిమా చేయాలనేది ఎప్పటి నుంచో కోరిక. ఈ సినిమా కోసం గత కొన్ని రోజులుగా కధా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రభాస్ బాహుబలి 2లో బిజీగా ఉండడం వలన ఈ సినిమా పూర్తయిన తర్వాతే పెదనాన్న కృష్ణంరాజు డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా ఉంటుందనుకున్నారు.

సుకుమార్‌తో గీతాఆర్ట్స్ సినిమా

నాన్న‌కు ప్రేమ‌తో స‌క్సెస్ తర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాంచ‌రణ్ హీరోగా సినిమా ఉంటుంద‌ని మ‌న‌కు తెలిసిందే.