చెర్రీ... ఇన్స్టాగ్రామ్లో చేరీ!
- IndiaGlitz, [Monday,July 08 2019]
చెర్రీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చేరారు. ఇకపై వరుసగా పిక్స్ పోస్ట్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన కేవలం ఫేస్బుక్లోనే ఉన్నారు. ఫేస్బుక్ పేజీని దాదాపు 5 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు. ఆయన ఏం చెప్పాలనుకున్నా అడపాదడపా ఫేస్ బుక్ పేజీ ద్వారానే చెప్పేవారు. ట్విట్టర్లో ఒకప్పుడు చరణ్ ఉండేవాడు. కానీ ఒకరోజు సడన్గా తన ట్విట్టర్ ఖాతా నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పి, అకౌంట్ క్లోజ్ చేశారు. అప్పటి నుంచి ఆయనకు సంబంధించిన వ్యవహారాలను ట్విట్టర్లో ఆయన సతీమణి పోస్ట్ చేస్తున్నారు.
రామ్చరణ్కి ట్విట్టర్ సీక్రెట్ ఖాతా ఉన్నట్టు ఆయనే గతంలోనూ ఓ సందర్భంలో నర్మగర్భంగా అంగీకరించారు. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న కొణిదెల ప్రొడక్షన్ కంపెనీకి ట్విట్టర్ అకౌంట్ ఉంది. ఇప్పుడు సైరా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేశారు. ప్రభాస్ కూడా ఇటీవలే అకౌంట్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఇన్స్టా హ్యాండిల్ ఆల్వేస్ రామ్చరణ్ అన్నమాట.
View this post on InstagramA post shared by Ram Charan (@alwaysramcharan) on Jul 8, 2019 at 12:24am PDT