మీ బాస్ ని ఆహ్వానిద్దాం రండి అంటున్న చ‌ర‌ణ్..!

  • IndiaGlitz, [Friday,December 30 2016]

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఖైదీ నెం 150 చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌న‌వ‌రి 4న విజ‌య‌వాడ‌లో భారీ స్ధాయిలో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ విజ‌య‌వాడ‌లోని ఇందిరా గాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ నిర్వ‌హిస్తున్నామ‌ని తెలియ‌చేస్తూ ఓ వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు.

ఈ వీడియోలో చ‌ర‌ణ్ ఏమ‌న్నారంటే...అంద‌రికీ హాయ్...నాకు తెలిసి ఈ వీడియోను ఎప్పుడో చేయాల్సింది. నేను ఏం మాట్లాడినా మీరు వినేట‌ట్లు లేరు. మీరు నాన్నగారి సినిమా ఖైదీ నెం 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించే ఎదురు చూస్తున్నారు అని అర్ధ‌మైంది. మీర‌నుకుంటున్న‌ట్లుగానే విజ‌య‌వాడ‌లో ఘ‌నంగా జ‌ర‌గ‌బోతుంది. ఈ ఈవెంట్ కు అభిమానులు అంద‌రూ రావాలి. మీ అన్న‌య్య బాస్ ని ఇండ‌స్ట్రీలోకి ఆహ్వానిద్దాం. పాత రోజుల్లో మిమ్మ‌ల్ని ఎలా అల‌రించారో అలానే...ఈ ఖైదీ నెం 150తో మొద‌లై ఇంకా ఎన్నో సినిమాలు చేయ‌బోతున్నారు. ద‌య‌చేసి జ‌న‌వ‌రి 4న అంద‌రూ రండి. క‌ల‌సి సెల‌బ్రేట్ చేసుకుందాం అన్నారు.