జనసేన మేనిఫెస్టోపై చెర్రీ ఆసక్తికర ట్వీట్...

  • IndiaGlitz, [Thursday,April 04 2019]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల కంటే ముందుగా జనసేన మేనిఫెస్టో ప్రకటించిన విషయం విదితమే. ఇందులో ముఖ్యంగా రైతాంగం, విద్య, ఉద్యోగాలు, వైద్యం, మహిళాభివృద్ధికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చారు. వైసీపీ-టీడీపీ ఇరు పార్టీల అధినేతలు ఒకరికి మించి ఒకరు.. బాబు రిలీజ్ చేస్తే తర్వాత రిలీజ్ చేద్దామని జగన్.. జగన్ రిలీజ్ చేస్తే నిశితంగా పరిశీలించి చేద్దామని చంద్రబాబు ఇలా మేనిఫెస్టోను రిలీజ్ చేయలేదు. అయితే పవన్ మాత్రం వీరిరివురి కంటే ముందు మేనిఫెస్టో రిలీజ్ చేయడం పార్టీకి కలిసొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఈ మేనిఫెస్టోను ఇప్పటికే పలువురు ప్రముఖులు, మేధావులు మెచ్చుకోగా తాజా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జనసేన మేనిఫెస్టో సూపర్బ్ అంటూ చరణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్న జనసేన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని ఆయన కితాబిచ్చాడు.

చెర్రీ సందేశం సారాంశం..

జ‌న‌సేన మేనిఫెస్టో చూసాను.. అద్భుతంగా ఉంది.. అన్ని వ‌ర్గాల వారికి స‌మ‌న్యాయం చేసిన‌ట్లు క‌నిపిస్తుంది.. ఆల్ ది బెస్ట్ క‌ళ్యాణ్ బాబాయ్. అందరూ జ‌న‌సేనకు ఓటేయండి.. ఓట్ ఫ‌ర్ గ్లాస్. జ‌న‌సేన కార్యకర్తల‌కు అభ్యర్థుల‌కు ఆల్ ది బెస్ట్ అని చరణ్ చెప్పుకొచ్చారు. కాగా.. క‌చ్చితంగా జ‌న‌సేన ప్రభుత్వం రావాల‌ని.. మార్పు రావాలంటూ క‌ళ్యాణ్ బాబాయ్ వైపు న‌డ‌వండి అంటూ ఇప్పటికే పలుమార్లు చెర్రీ మీడియా వేదికగా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

More News

వైఎస్ జగన్ స్థానంలో నేనుంటే.. పవన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానంలో తానుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

జనసేనకు జనం బ్రహ్మరథం.. గంటా 'గంట' అంతే!!

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాద‌ర‌ణ ఉన్న నాయ‌కుడు కాదు.. ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి డ‌బ్బుతో ప్రజాద‌ర‌ణను కొనుక్కోవాలనుకొంటున్నారు

మీ ఇంట్లో మనిషిగా గుర్తించండి.. ఒక్క ఫోన్ కాల్‌తో..!

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌స్తే డ్వాక్రా మ‌హిళ‌ల‌కు అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు అన్నీ తీసేస్తాడంటూ టీడీపీ నాయ‌కులు దుష్ప్రచారం చేస్తున్నారు...

జగన్‌ను ఎలా నమ్మాలి.. అలీని వైసీపీలోకి ఎందుకు తీసున్నావ్!?

వైఎస్ఆర్సీపీ నాయ‌కుల‌కు జ‌న‌సేన పార్టీ అంటే అసూయ‌ అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ లాంటి నిజాయ‌తీప‌రుల‌ను పార్టీలోకి

మే 17న అల్లు శిరీష్ 'ABCD' గ్రాండ్ రిలీజ్‌

యువ క‌థానాయకుడు అల్లు శిరీష్ హీరోగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి.సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై రూపొందుతోన్న ఎంట‌ర్‌టైన‌ర్  'ABCD'.