జనసేన మేనిఫెస్టోపై చెర్రీ ఆసక్తికర ట్వీట్...
- IndiaGlitz, [Thursday,April 04 2019]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల కంటే ముందుగా జనసేన మేనిఫెస్టో ప్రకటించిన విషయం విదితమే. ఇందులో ముఖ్యంగా రైతాంగం, విద్య, ఉద్యోగాలు, వైద్యం, మహిళాభివృద్ధికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చారు. వైసీపీ-టీడీపీ ఇరు పార్టీల అధినేతలు ఒకరికి మించి ఒకరు.. బాబు రిలీజ్ చేస్తే తర్వాత రిలీజ్ చేద్దామని జగన్.. జగన్ రిలీజ్ చేస్తే నిశితంగా పరిశీలించి చేద్దామని చంద్రబాబు ఇలా మేనిఫెస్టోను రిలీజ్ చేయలేదు. అయితే పవన్ మాత్రం వీరిరివురి కంటే ముందు మేనిఫెస్టో రిలీజ్ చేయడం పార్టీకి కలిసొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఈ మేనిఫెస్టోను ఇప్పటికే పలువురు ప్రముఖులు, మేధావులు మెచ్చుకోగా తాజా మెగా పవర్ స్టార్ రామ్చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జనసేన మేనిఫెస్టో సూపర్బ్ అంటూ చరణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్న జనసేన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని ఆయన కితాబిచ్చాడు.
చెర్రీ సందేశం సారాంశం..
జనసేన మేనిఫెస్టో చూసాను.. అద్భుతంగా ఉంది.. అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసినట్లు కనిపిస్తుంది.. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ బాబాయ్. అందరూ జనసేనకు ఓటేయండి.. ఓట్ ఫర్ గ్లాస్. జనసేన కార్యకర్తలకు అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ అని చరణ్ చెప్పుకొచ్చారు. కాగా.. కచ్చితంగా జనసేన ప్రభుత్వం రావాలని.. మార్పు రావాలంటూ కళ్యాణ్ బాబాయ్ వైపు నడవండి అంటూ ఇప్పటికే పలుమార్లు చెర్రీ మీడియా వేదికగా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
Excellent manifesto giving priority to all sectors of the society. A new wave in politics. Congrats Kalyan Babai and best wishes to all the candidates of JanaSena Party!!#VoteForGlass#JANASENARevolution2019
— Ram Charan (@RamCharan_Off) April 4, 2019