గోదావరిలో చరణ్....

  • IndiaGlitz, [Wednesday,December 21 2016]

మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో సినిమా స్టార్ట్ కానుంది. సంక్రాంతి త‌ర్వాత సినిమా సెట్స్‌లోకి వెళ్ల‌నుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తిసురేష్ పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ స‌బ్జెక్ట్‌లో చ‌రణ్ గ‌డ్డంతో క‌నిపించ‌నున్నాడు.

మ‌రి విలేజ్ బ్యాక్ డ్రాప్ క‌దా..ఏ ప్రాంతంలో షూట్ చేయాల‌నే దానిపై యూనిట్ లోకేష‌న్స్ వేట‌లో ఉంద‌ట‌. అల్రెడి గోదావ‌రి జిల్లాల ప్రాంతాలైన కాకినాడ‌, కొత్త‌ప‌ల్లి ప్రాంతాల‌తో పాటు త‌మిళ‌నాడులోని పొల్లాచ్చిలో కూడా చిత్రీక‌ర‌ణ జ‌రుపుతారట‌. తండ్రి సినిమాకు నిర్మాత‌గా మారిన చ‌ర‌ణ్‌, ఖైదీ నంబ‌ర్ 150ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు.