క్మిస్మస్ బరిలోకి చరణ్...?

  • IndiaGlitz, [Monday,August 07 2017]

రామ్‌చ‌ర‌ణ్‌,సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'రంగ‌స్థలం1985'. మైత్రీమూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శలో ఉంది. పూర్తి 1985 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రూపొందుతుండ‌టం, రామ్‌చ‌ర‌ణ్ ప‌ల్లెటూరి యువ‌కుడిగా క‌న‌ప‌డ‌నుండ‌టం, సుకుమార్ టేకింగ్ అన్నీ సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతున్నాయి.

ఈ సినిమాను ముందుగా జ‌న‌వ‌రి సంక్రాంతికి విడుద‌ల చేద్దామ‌నుకున్నారు. అయితే సినిమా షూటింగ్ అక్టోబ‌ర్‌లో ముగియ‌నుండ‌టం. అల్రెడి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుండ‌టంతో సినిమా త్వ‌ర‌గానే పూర్త‌య్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. మ‌రోవైపు సంక్రాంతికి భారీ పోటీ కూడా ఉంది. సంక్రాంతికి వ‌స్తే థియేట‌ర్స్ స‌మ‌స్య ఉండ‌నే ఉంటుంది కాబ‌ట్టి సినిమాను క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేస్తే బావుంటుందేమోన‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి చివ‌ర‌గా ఏ నిర్ణ‌యం తీసుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.