చరణ్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి...

  • IndiaGlitz, [Saturday,February 27 2016]

రాంచ‌ర‌ణ్ హీరోగా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళంలో విజ‌య‌వంత‌మైన తనీఒరువ‌న్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి ధ్రువ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో విల‌న్‌గా అర‌వింద్ స్వామి న‌టిస్తున్నాడు. బ్రూస్ లీ ద ఫైటర్ చిత్రంలో రాంచరణ్ తో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు హిప్ హాప్ త‌మిళ సంగీతం అందిస్తున్నాడు. అల్రెడిచిత్రీకరణ స్టార్ట్ చేసుకున్న
ఈ చిత్రం లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ మార్చి 10 నుండి మార్చి 21వరకు జరుగుతుంది. చరణ్ మార్చి 14నుండి షూటింగ్ పాల్గొంటాడట.